Tamil Nadu:తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి గవర్నర్, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఘర్షణకు కారణం కాబోతోంది.
MK Stalin: తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి చెందిన మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణను పెంచాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సీఎం స్టాలిన్ క్యాబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార డీఎంకే పార్టీ ఈడీ రైడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు పలుకుతున్నాయి.
Amit Shah: కాంగ్రెస్, డీఎంకే వంశపారంపర్య రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆదివారం తమిళనాడు చెన్నైలో ఆయన పర్యటించారు. ఈ రెండు పార్టీల అవినీతిని 2G, 3G, 4Gగా అభివర్ణించారు. తమిళనాడులో ఈ పార్టీలను విసిరిపడేసి, ఈ భూమి పుత్రడుికి పట్టం కట్టాలి అని అన్నారు. తొమ్మిదేళ్ల నరేంద్రమోడీ పాలనను ప్రజలకు వివరించేందుకు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
K.Annamalai : తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై మరోసారి అధికార డీఎంకేను టార్గెట్ చేశారు. తమిళనాడులో రూ.2000 నోట్ల లావాదేవీలను ట్రాక్ చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. రియల్ స్టేట్ కంపెనీ జి స్క్వేర్కు చెందిన పలు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి. జి స్క్వేర్ కంపెనీ గతంలో రాజకీయ వివాదాల్లో చిక్కుకుంది.
IPL Tickets Issue: తమిళనాడులో ఇప్పుడు ఐపీఎల్ టికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే సీఎస్కే టీం ను బ్యాన్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు, పార్టీలు కోరతున్నాయి. పీఎంకే శాసనసభ్యుడు ఏకంగా తమిళనాడు అసెంబ్లీలోనే సీఎస్కేని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వ్యవహారం కొసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్లు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
Parliament : పార్లమెంట్లో మైక్లు స్విచ్ ఆఫ్ చేశారని, తన వాయిస్ని సైలెంట్ చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మూడు రోజుల పాటు తన మైక్రోఫోన్ మ్యూట్ అయిందని ఆరోపిస్తూ లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి బుధవారం స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Udhayanidhi Stalin: డీఎంకే పార్టీ యువనేత, ఆ రాష్ట్ర మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో కోయంబత్తూర్ లో ఆదివారం సామూహిక వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయనిధి హాజరయ్యారు. సీఎం ఎంకే స్టాలిన్ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ఖర్చుతో 81 జంటలకు పెళ్లి జరిపించారు.