Udhayanidhi Stalin: “సనాతన ధర్మాన్ని నిర్మూలించండి”.. స్టాలిన్ కొడుకు వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని శనివారం అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ‘సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటది, దీన్ని నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బీజేపీ పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తమిళనాడు మంత్రిపై కేసు పెట్టాలని పలువురు పిలుపునిచ్చారు. సీఎం స్టాలిన్, డీఎంకే పార్టీ వారసుడిగా పేరు సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది. ‘డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని రూపుమాపడం గురించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ మౌనమే ఈ జాతి విధ్వంసక పిలుపుకు మద్దతు ఇస్తోందని, పేరుకు తగ్గట్లే ఇండియా కూటమికి అవకాశం ఇస్తే వేల ఏళ్ల నాగరితకను నిర్మూలిస్తుందని’ బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
Read Also: Bhaganvanth Kesari : యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ గా నిలిచిన గణేష్ ఆంథమ్..
చెన్నైలో జరిగిన రచయితల సదస్సులో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనే ఆలోచన తిరోగమనమైందని, దీన్ని వ్యతిరేకించడం సాధ్యం కాదని, నిర్మూలించడమే పరిష్కారం అని అన్నారు. ఇది కులం, లింగ ప్రాతిపదికన ప్రజలను విభజిస్తోందని, సమానత్వ, సామాజిక న్యాయానికి ప్రాథమికంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. తాను మాట్లాడిన ప్రతీ మాటకు కట్టుబడి ఉంటానని ఉదయనిధి సమర్థించుకున్నారు. సనాతన ధర్మం సమాజంపై ప్రతికూలం ప్రభావంపై అంబేద్కర్, పెరియార్ చేసిన రచనల్ని ఏ వేదికలోనైనా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అనేెక సాంఘిక దురాచారాలకు సనాతన ధర్మమే కారణం అంటూ వ్యాఖ్యానించారు. న్యాయస్థానంలో, ప్రజాకోర్టులో ఎదరయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. క్రైస్తవ మిషనరీల ఆలోచనలను ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్లు చెబుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు.
The only resolve that the Gopalapuram Family has is to accumulate wealth beyond the State GDP.
Thiru @Udhaystalin, you, your father, or his or your idealogue have a bought-out idea from Christian missionaries & the idea of those missionaries was to cultivate dimwits like you to… https://t.co/sWVs3v1viM
— K.Annamalai (@annamalai_k) September 2, 2023
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..