Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Jayalalithaas Saree Was Pulled Nirmala Sitharaman To Dmk On Women Safety

Nirmala Sitharaman: అసెంబ్లీలో జయలలిత చీర లాగి ఎగతాళి చేశారు.. డీఎంకేపై కేంద్ర మంత్రి ఫైర్

Published Date :August 10, 2023 , 4:18 pm
By Mahesh Jakki
Nirmala Sitharaman: అసెంబ్లీలో జయలలిత చీర లాగి ఎగతాళి చేశారు.. డీఎంకేపై కేంద్ర మంత్రి ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nirmala Sitharaman: మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. డీఎంకే ఎంపీలు చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చే క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంశాన్ని ప్రస్తావించారు. భారతదేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై డీఎంకే నాయకురాలు కనిమొళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ‘మణిపూర్, రాజస్థాన్ లేదా ఢిల్లీలో ఎక్కడైనా మహిళలు బాధపడుతున్నారని, దానిని మనం సీరియస్‌గా తీసుకోవాలని, అయితే ఇందులో రాజకీయాలు ఉండకూడదని అన్నారు.

1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత చీరను లాగిన సంఘటనను ఆమె వివరించారు. “ఆమె ప్రతిపక్ష నాయకురాలు. ఆమె(జయలలిత) అప్పటికీ సీఎం కాలేదు.. ప్రతిపక్ష నాయకురాలు. తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీర లాగి… డీఎంకే నవ్వుతూ, ఎగతాళి చేసింది. దీంతో ముఖ్యమంత్రి అయిన తర్వాతే తాను తిరిగి అసెంబ్లీకి వస్తానని జయలలిత ప్రమాణం చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాతే సభకు వచ్చారు’’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నిరసన వ్యక్తం చేస్తున్న డీఎంకే సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘‘మీరు కౌరవ సభ గురించి మాట్లాడుతున్నారు, ద్రౌపది గురించి మాట్లాడుతున్నారు, డీఎంకే జయలలితను మరిచిపోయిందా? నమ్మశక్యంగా లేదు.” అని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి లోక్‌సభలో ప్రసంగించారు.

Also Read

  • New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు 'షాక్'.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!
  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..

సెంగోల్‌ న్యాయానికి చిహ్నం 

కేంద్రం హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన మరో కామెంట్‌పై స్పందిస్తూ.. సిలపతిగారం స్ఫూర్తిని ప్రధానమంత్రి స్ఫూర్తిగా అమలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆమె.. “సెంగోల్”.. న్యాయానికి చిహ్నంగా కొత్త పార్లమెంటులో అమర్చిన రాజదండమని.. “మర్చిపోయి మ్యూజియంలో ఉంచబడింది” అని అన్నారు. ఇది తమిళులను అవమానించడం కాదా అని ఆమె ప్రశ్నించారు. దేశంలోని పురాతన శైవ మఠాలలో ఒకటైన తమిళనాడులోని తిరువావడుతురై ఆధీనం ద్వారా భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు రాజదండం సమర్పించబడింది.

రూ.700 కోట్లు పెరిగింది.. రాష్ట్ర సర్కారు వల్లే.. 

తమిళనాడులోని మదురైలో ప్రతిపాదిత ఎయిమ్స్ ఆసుపత్రికి బడ్జెట్‌ రూ. 700 కోట్లు పెరిగిందని, భూసేకరణ ఆలస్యమైందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా డీఎంకే సభ్యుల నినాదాల మధ్య ఎంఎస్ సీతారామన్ మాట్లాడుతూ.. తమిళనాడు భూసేకరణ ఆలస్యం కావడంతో ప్రతిపాదిత ఆసుపత్రి బడ్జెట్ రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు పెరిగిందన్నారు. ఆస్పత్రిని ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలంటూ డీఎంకే సభ్యులు తమిళంలో ‘ఎప్పో’ అంటూ నినాదాలు చేశారు. మంత్రి ఇంగ్లీషు, తమిళం రెండింటిలో సమాధానమిచ్చారు. ఎంఎస్ సీతారామన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే నిందలు వేయాలని, ఆలస్యానికి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవాలని చూస్తోందని అన్నారు. కరోనా సమయంలో సైట్ తనిఖీలు జరగలేదని, ఫలితంగా, వారు (రాష్ట్ర ప్రభుత్వం) పనిని వేగవంతం చేయలేకపోయారని ఆమె అన్నారు.

దేశఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి క్షీణత అనే జంట సవాళ్లతో పోరాడుతున్నప్పుడు భారతదేశం తన భవిష్యత్తు వృద్ధిపై ఆశాజనకంగా, సానుకూలంగా ఉండే ప్రత్యేక స్థితిలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజలకు కలలను అమ్ముకునేవారని, ప్రస్తుత పాలనలో కలలు నెరవేరుతున్నాయని అన్నారు. “భారతదేశం 2013లో ప్రపంచంలోని ఐదు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంది, కానీ ఇప్పుడు అది కేవలం తొమ్మిదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది” అని ఆమె చెప్పారు. 2004 నుండి 2014 వరకు ఉన్న పదవీకాలాన్ని ప్రస్తావిస్తూ గత యూపీఏ పాలన మొత్తం దశాబ్దాన్ని వృధా చేసిందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.

2022లో గ్లోబల్ ఎకానమీలో కేవలం మూడు శాతం మాత్రమే వృద్ధి నమోదైందని.. 2023లో అది 2.1 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.యూఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలు.. యూరో జోన్ సవాళ్ళను ఎదుర్కొంటున్నాయని, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా వినియోగదారుల డిమాండ్, వేతన స్తబ్దతకు సంబంధించిన తమ స్వంత సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆర్థిక మంత్రి చెప్పారు. 2013లో యూపీయే ప్రభుత్వం ఉన్నపుడు ప్రముఖ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత దేశాన్ని ప్రపంచంలో బలహీన ఆర్థిక వ్యవస్థలుగల ఐదు దేశాల్లో ఒకటిగా వర్గీకరించిందని చెప్పారు. కానీ ప్రస్తుత మోదీ పాలనలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని చెప్తూ, భారత దేశ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని అన్నారు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘గరీబీ హటావో’ నినాదాన్ని ప్రస్తావిస్తూ, పేదరికాన్ని అసలు తొలగించగలరా అని ఆమె అడిగారు. ప్రధాని మోడీ దీనిని పూర్తిగా మార్చారు. మా పాలనలో పరివర్తన ఉందని ఆమె అన్నారు. “వస్తాయి, అందుతాయి” అని ప్రజలు గత ప్రభుత్వాల హయాంలో ఆశించేవారని, ప్రస్తుతం “వచ్చాయి. అందాయి’ అని ప్రజలు అంటున్నారని” కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DMK
  • Jayalalitha Saree
  • Loksabha
  • MK Stalin
  • Monsoon Session

తాజావార్తలు

  • New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!

  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు

  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!

  • Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్‌, తాజా అప్‌డేట్ ఇదే!

  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions