Trump-NATO: నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం.. మిత్రుల సహాయం అక్కర్లేదని వెల్లడి
- ఇరాన్తో యుద్ధం వేళ నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
- మిత్రుల సహాయం అక్కర్లేదని వెల్లడి
- ట్రూత్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్తో యుద్ధం వేళ నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశాల అవసరం ఎన్నడూ లేదన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
‘‘మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా మేము చేస్తున్న సైనిక చర్యలో పాలుపంచుకోవడానికి నాటో మిత్రదేశాలు చాలా వరకు ఇష్టపడటం లేదు. వాస్తవానికి మేము చేస్తున్న దానికి దాదాపు ప్రతి దేశం గట్టిగా మద్దతు తెలిపినప్పటికీ.. ఇరాన్ను ఏ విధంగానూ, ఏ రూపంలోనూ అణ్వాయుధం కలిగి ఉండటానికి అనుమతించకూడదని చెప్పినప్పటికీ ఇది జరిగింది. అయితే వారి చర్య నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే నేను నాటోను ఎప్పుడూ ఒక ఏకపక్ష వ్యవహారంగానే భావించాను. ఈ దేశాలను రక్షించడానికి మనం ఏటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంటాము. మనం వారిని రక్షిస్తాము. కానీ వారు మన కోసం ఏమీ చేయరు. ముఖ్యంగా అవసరమైన సమయంలో’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
‘‘అదృష్టవశాత్తూ ఇరాన్ సైన్యాన్ని అమెరికా నాశనం చేసింది. వారి నౌకాదళం పోయింది. వారి వైమానిక దళం పోయింది. వారి విమాన నిరోధక, రాడార్ పోయింది. బహుశా అన్నింటికన్నా ముఖ్యంగా దాదాపు ప్రతి స్థాయిలో ఉన్న నాయకులు హతమయ్యారు. ఇకపై మనకు, మన మధ్యప్రాచ్య మిత్రదేశాలకు, లేదా ప్రపంచానికి ఎప్పటికీ ముప్పు కలిగించలేరు! మనకు ఇంతటి సైనిక బలం ఉన్నందున… విజయం. మాకు ఇకపై నాటో దేశాల సహాయం అవసరం లేదు. నాటోను కూడా కోరుకోవడం లేదు. మేము దానిని ఎన్నడూ కోరుకోలేదు! అదే విధంగా.. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా విషయంలో కూడా. నిజానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా చెబుతున్నాను. మాకు ఎవరి సహాయం అవసరం లేదు!.’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
కీర్ స్టార్మర్..
ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పటికీ.. ‘‘దృష్టి ఉక్రెయిన్పైనే కేంద్రీకృతమై ఉండాలి.’’ అని యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మంగళవారం లండన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అన్నారు. ‘‘ఇరాన్తో స్పష్టంగా సంఘర్షణ జరుగుతోంది. కానీ ఉక్రెయిన్లో ఏమి జరుగుతుందో తెలిసిందే. మన మద్దతు అవసరాన్ని మనం విస్మరించకూడదు.’’ అని స్టార్మర్ అన్నారు.
తాజావార్తలు
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..