Udhayanidhi Stalin: “మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ పిలుపునిచ్చినప్పుడు”.. సనాతన వ్యాఖ్యలపై ఉదయనిధి
Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్ఠాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, ముఖ్యంగా బీజేపీ పార్టీ, పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే తాను ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి వివరణ ఇచ్చుకుంటున్నారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని ఆరోపించారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో జరిగిన రచయితల సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోలుస్తూ..దాన్ని నిషేధించడం కన్నా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. బీజేపీ, డీఎంకే పార్టీతో పాటు ఇండియా కూటమిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తోంది.
Also Read
- India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
ఈ వ్యాఖ్యలపై ఉదయనిధిని ప్రశ్నించిన సందర్భంగా ఆయన తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.. ‘‘ నేను మారణహోమానికి పిలుపునిచ్చినట్లుగా కొందరు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు. మరికొందరు ద్రవిడవాదాన్ని తొలగించాలని అంటున్నారు. దీని అర్థం డీఎంకే వాళ్లను చంపాలనా..? కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాని పిలుపునిచ్చినప్పుడు, కాంగ్రెస్ వాళ్లు చంపబడ్డారా..? సనాతన అంటే ఏమిటి.. దీని అర్థం ఏది మారకూడని, శాశ్వతంగా ఉండాలని’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: New Delhi: విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. అంధురాలిని లోపలే వదిలేసిన వైనం
‘‘ద్రవిడ మోడల్ మార్పు కోసం పిలుపునిచ్చింది. అందర్ని సమానంగా చూస్తుంది. బీజేపీ నా వ్యాఖ్యల్ని వక్రీకరించింది. నకిలీ వార్తలను ప్రచారం చేస్తోంది. ఇది వారికి అలవాటైన పని. బీజేపీ నాపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధం. బీజేపీకి ఇండియా కూటమి భయం పట్టుకుంది. ప్రజల దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తోంది’’ అని ఉదయనిధి ఆరోపించారు.
కేంద్ర హోమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్లో ఎవరు టాప్లో నిలుస్తారు?
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!