Udhayanidhi Stalin: “మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ పిలుపునిచ్చినప్పుడు”.. సనాతన వ్యాఖ్యలపై ఉదయనిధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్ఠాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, ముఖ్యంగా బీజేపీ పార్టీ, పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే తాను ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి వివరణ ఇచ్చుకుంటున్నారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని ఆరోపించారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో జరిగిన రచయితల సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోలుస్తూ..దాన్ని నిషేధించడం కన్నా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. బీజేపీ, డీఎంకే పార్టీతో పాటు ఇండియా కూటమిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తోంది.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
ఈ వ్యాఖ్యలపై ఉదయనిధిని ప్రశ్నించిన సందర్భంగా ఆయన తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.. ‘‘ నేను మారణహోమానికి పిలుపునిచ్చినట్లుగా కొందరు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు. మరికొందరు ద్రవిడవాదాన్ని తొలగించాలని అంటున్నారు. దీని అర్థం డీఎంకే వాళ్లను చంపాలనా..? కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాని పిలుపునిచ్చినప్పుడు, కాంగ్రెస్ వాళ్లు చంపబడ్డారా..? సనాతన అంటే ఏమిటి.. దీని అర్థం ఏది మారకూడని, శాశ్వతంగా ఉండాలని’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: New Delhi: విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. అంధురాలిని లోపలే వదిలేసిన వైనం
‘‘ద్రవిడ మోడల్ మార్పు కోసం పిలుపునిచ్చింది. అందర్ని సమానంగా చూస్తుంది. బీజేపీ నా వ్యాఖ్యల్ని వక్రీకరించింది. నకిలీ వార్తలను ప్రచారం చేస్తోంది. ఇది వారికి అలవాటైన పని. బీజేపీ నాపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధం. బీజేపీకి ఇండియా కూటమి భయం పట్టుకుంది. ప్రజల దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తోంది’’ అని ఉదయనిధి ఆరోపించారు.
కేంద్ర హోమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!