2022 సంక్రాంతి క్లాష్ కు చెక్ పెట్టేశారు నిర్మాత దిల్ రాజు. ప్రొడ్యూసర్ గిల్డ్ మీటింగ్ తరువాత ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ క్రమంలో దిల్ రాజు కూడా పవన్ కోసం వెనకడుగు వేయక తప్పలేదు. ‘భీమ్లా నాయక్’ కోసం తన సినిమా విడుదల తేదీని త్యాగం చేసేశారు దిల్ రాజు. ‘భీమ్లా నాయక్’తో పాటు ‘ఎఫ్3’ కూడా వాయిదా పడింది. 2022 ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన “ఎఫ్3: ఫన్…
టాలీవుడ్ నిర్మాతలు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి పాన్ ఇండియా మూవీలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ఉన్న నేపథ్యంలో భీమ్లానాయక్ సినిమా విడుదల పోస్ట్పోన్ తో పాటు మరికొన్ని సినిమాల వివరాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం కోసం కింద ఇచ్చిన లింక్లో చూడండి.
శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ సినిమా ఈవెంట్లు హైదరాబాద్ తరువాత వరంగల్లో ఎక్కువగా జరుగుతున్నాయని, ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతోనే వరంగల్లో ఈవెంట్లు నిర్వహించగలుగుతున్నామని దిల్ రాజు అన్నారు. వరంగల్లో ఎంసీఏ సినిమా షూటింగ్, ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించామని, ఆ సినిమా మంచి విజయం సాధించిందని, ఇప్పుడు అదే వరంగల్లో శ్యామ్…
తెలుగువారికి మలయాళం మాట్లాడటం ఎంత కష్టమో! మలయాళీలకు తెలుగు భాష మాట్లాడటమూ అంతే కష్టం. అయితే తొలిసారి తెలుగు సినిమా ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్ర చేస్తున్న మలయాళ నటుడు దేవ్ మోహన్ మాత్రం ఇష్టపడి, కష్టపడి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ…
రూమర్స్ నమ్మొద్దు… అంటూ నాగఛైతన్య నెక్స్ట్ మూవీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ పుకార్లను కొట్టిపారేశారు. ఈరోజు ఉదయం నుంచి నాగ చైతన్య నెక్స్ట్ మూవీ “థాంక్యూ” మూవీని ఓటిటి ప్లాట్ఫామ్లో నేరుగా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా కథానాయికగా నటించింది. అయితే దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇస్తూ…
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సినిమాను నైజాంతో పాటు ఏపీలోని వైజాగ్ ఏరియాకు నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా పంపిణీ చేశాడు. డిస్ట్రిబ్యూటర్గా ఈ సినిమా ద్వారా లాభాలను చవిచూడటంతో దిల్ రాజు అఖండ టీమ్కు పార్టీ ఇచ్చాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి బాలయ్య, నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సహా పలువురు దిల్ రాజు…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్ర విడుదలకు సంబంధించిన అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర విడుదలను…
సి. రమేశ్ నాయుడు దర్శకత్వంలో గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘పంచనామ’. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేశ్ నాయుడు మాట్లాడుతూ, ”మా చిత్ర నిర్మాతలకు ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కథ విని, నన్ను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీనిని తెరకెక్కించేందుకు సహకరించారు. ఒక వినూత్నమైన కథతో ఈ…
కారు రేస్, బైక్ రేస్ లపై చాలా సినిమాలు వచ్చాయి.. కానీ మొదటిసారి మడ్ రేస్ పై ఒక చిత్రం రాబోతోంది. నూతన దర్శకుడు డా. ప్రగాభల్ దర్శకత్వంలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మడ్డీ’.. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కలిసి సమావేశం అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశం వచ్చే వారం హైదరాబాద్లో జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రాజమౌళి పవన్ ని కలవడానికి గల అసలు కారణం ‘భీమ్లా నాయక్’. “భీమ్లా నాయక్” రూపంలో కొత్త తలనొప్పిరాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే…