దుష్యంతుడి డబ్బింగ్ పూర్తి! నిర్మాతల కితాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగువారికి మలయాళం మాట్లాడటం ఎంత కష్టమో! మలయాళీలకు తెలుగు భాష మాట్లాడటమూ అంతే కష్టం. అయితే తొలిసారి తెలుగు సినిమా ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్ర చేస్తున్న మలయాళ నటుడు దేవ్ మోహన్ మాత్రం ఇష్టపడి, కష్టపడి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పురాణ గాథను ‘దిల్’ రాజుతో కలిసి, గుణశేఖర్ కుమార్తె నీలిమా నిర్మిస్తోంది. సినిమా షూటింగ్ సమయంలో ఎంత డెడికేషన్ తో అయితే దేవ్ మోహన్ నటించాడో, ఇప్పుడు డబ్బింగ్ సమయంలోనూ అదే అంకిత భావం చూపించి తమను అబ్బురపరిచాడంటూ నిర్మాతలు ‘దిల్’ రాజు, నీలిమా కితాబిచ్చారు. దేవ్ మోహన్ డబ్బింగ్ పనులు పూర్తయ్యానని దిల్ రాజు ఈ రోజు ట్వీట్ చేశాడు. మరి భారీ అంచనాలు నెలకొన్న ‘శాకుంతలం’ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది మాత్రం నిర్మాతలు ఇంతవరకూ వెల్లడించలేదు.
Also Read
తాజావార్తలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..