Kidney Health: ఈ పద్ధతులు మార్చుకోకపోతే కిడ్నీలు మార్చుకోవాల్సిందే!
- శరీర భాగాలలో ముఖ్యమైన అవయాలలో కిడ్నీలు ముఖ్య పాత్ర.
- రక్తాన్ని ఫిల్టర్ చేసి, అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపుతాయి.
- కొన్ని పద్ధతులు మార్చుకోకపోతే కిడ్నీలు మార్చాల్సిందే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Health: కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా పనిచేస్తాయి. ఇవి ప్రధానంగా శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేసి, అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపుతాయి. అలాగే శరీరంలోని నీటి స్థాయిని నియంత్రించడం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను కాపాడటం, హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడటం వంటి అనేక ముఖ్యమైన పనులను చేస్తాయి. అయితే మన దైనందిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని చెడు అలవాట్లు అనుసరించడం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిని, కాలానుగుణంగా పనిచేయడాన్ని తగ్గించుకుంటాయి. ఇప్పుడు అలాంటి కొన్ని హానికరమైన అలవాట్లు ఏవో తెలుసుకుందాం.
Read Also: LSG vs MI: లక్నో vs ముంబై.. ఎవరిది పైచేయి? గణాంకాలు ఎం చెబుతున్నాయంటే?
Also Read
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
- New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
అధిక ఉప్పు (సోడియం) ఆహారం తీసుకోవడం:
ఉప్పులో ఎక్కువగా సోడియం ఉండటం వల్ల రక్తపోటు (BP) పెరుగుతుంది. దీని ప్రభావం కిడ్నీలపై ఎక్కువగా ఉంటుంది. అధికంగా ఉప్పు ఉండే ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటాయి. కాబట్టి ఈ విధమైన ఆహారాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.
హై బ్లడ్ ప్రెజర్ను నిర్లక్ష్యం చేయడం:
హై బ్లడ్ ప్రెజర్ సమస్య ఉండడం వల్ల కిడ్నీల రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇది కిడ్నీల పనితీరును తగ్గించి, కాలక్రమేణా కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి, హై బీపీ ఉన్నవారు తప్పకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
అధిక ప్రొటీన్ ఆహారం తీసుకోవడం:
అధిక ప్రొటీన్ ఆహారం అంటే ముఖ్యంగా మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. కిడ్నీలకు సంబంధించి ఇప్పటికే ఏదైనా సమస్య ఉన్నవారు ప్రొటీన్ను పరిమితంగా తీసుకోవడం మంచిది.
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు”పై సభలో రాహుల్ గాంధీ మౌనం.. ప్రియాంకా గైర్హాజరు.. ఎందుకు..?
తగినంత నీరు తాగకపోవడం:
శరీరంలో తగినంత నీరు లేకపోతే, కిడ్నీలు వ్యర్థాలను ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు (కిడ్నీ స్టోన్స్), ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీటిని తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
డయాబెటిస్ను నియంత్రించకపోవడం:
రక్తంలో షుగర్ లెవల్ పెరిగితే కిడ్నీల రక్తనాళాలు దెబ్బతింటాయి. దీని వల్ల కిడ్నీ పనితీరు తగ్గిపోవడం, చివరికి కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు, బ్లడ్ షుగర్ను నియంత్రణలో ఉంచుకోవాలి.
తరచుగా పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకోవడం:
తలనొప్పి, కీళ్ల నొప్పి వంటి సమస్యలకు తరచుగా పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో కిడ్నీలు బలహీనపడటానికి, చివరికి కిడ్నీ ఫెయిల్యూర్కు కారణమవుతుంది. ఇకపోతే ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ఎంతో ముఖ్యం. సరైన ఆహారం, తగినంత నీరు, నియంత్రిత రక్తపోటు, నియంత్రిత షుగర్ లెవల్స్ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడతాయి. కాబట్టి, పై పేర్కొన్న హానికరమైన అలవాట్లను వీలైనంత త్వరగా మానుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!