ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు. గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతు పింఛన్ ఇవ్వలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాలు కంటే ఎక్కువ ఆదాయం ఉన్న మహారాష్ట్రలో పింఛన్ 1000 రూపాయలు మాత్రమే అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ లో పింఛన్ రూ. 2500 ఇస్తున్నారని సీఎం తెలిపారు.
READ MORE: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన సీడీఎస్.. ఏం చెప్పారంటే..
కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుందని వాటినే తినడం వలన డయాబెటిస్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 16347 పోస్ట్ లతో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామని తెలిపారు.. గత ప్రభుత్వం రోడ్లు కి గుంతలు పెట్టి వెళ్ళిందని.. పవన్ కళ్యాణ్ అన్ని పంచాయతీ లకు ఒకే సారి నిధులు విడుదల చేశారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేలా గత ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. టీటీడీలో అన్న దానం ప్రారంభించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. గడిచిన ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ విచ్చల విడిగా పెరిగి పోయిందని.. వాటిని అమ్మిన, కొన్న తాట తీస్తానని హెచ్చరించారు. ఏజెన్సీ లో గంజాయి పెంపకం మాములు అయిపోయిందన్నారు.. ఏపీలో సిబీఎన్ ఉన్నాడు.. మిగతా రాష్ట్రాలు కంటే డిఫరెంట్ గా ఉంటుంది.. పెట్టుబడులు పెట్టండని ఢిల్లీలో చెప్పానన్నారు. ఒక్కొక్క జంట 2.1 పిల్లలును కనాలని మరోసారి సూచించారు.. కానీ ఇప్పుడు 1.56కి పడిపోయారని తెలిపారు. 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతుందని.. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. 20 వేలు రూపాయలు మూడు విడతలుగా రైతులుకి అందిస్తామని శుభవార్త తెలిపారు.
READ MORE: Sravanthi : యాంకర్ స్రవంతి క్యూట్ ఫోజులు..