Emergency at Delhi airport: ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఫెడ్ ఎక్స్ విమానం పక్షి దాడికి గురైంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శనివారం ఈ ఘటన జరిగింది. విమానం 1000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే పక్షిని ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 10.46 గంటలకు టేకాప్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరారు. దీంతో విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో…
Women Pilots: భారతదేశంలో మొత్తం పైలెట్లలో 15 శాతం మహిళలే ఉన్నారు. ప్రపంచ సగటు కన్నా ఇది ఎక్కువ. ప్రపంచంలో మహిళా పైలెట్ల సగటు 5 శాతం మాత్రమే ఉంది. భారత దేశంలో మహిళా పైలెట్లు దీనికి మూడు రెట్లు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఎయిర్ ఆపరేటర్లలో 67 మంది విదేశీ పైలెట్లు పనిచేస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది.
IndiGo Leaves Behind 37 Bags Of Passengers At Hyderabad Airport: ఎయిర్ లైన్స్ సంస్థలు అందిస్తున్న సేవల్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఎయిరిండియాలో మూత్ర విసర్జన సంఘటన ఇండియా విమానయాన రంగంలో తీవ్ర ప్రకంపనలు రేపింది.
IndiGo Incident: ఇటీవల కాలంలో విమానయాన రంగంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. గత నెల వరకు ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. దీంతో విమానాల్లో వికృతంగా ప్రవర్తించే ప్రయాణికుల పట్ల వ్యవహారించాల్సిన తీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేయాల్సి వచ్చింది. ఏయిరిండియా సంస్థ తన మద్యం పాలసీని సవరించుకుంది.
Flight Tickets: విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది విమానయాన రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్లైన్స్ ఏకపక్షంగా డౌన్గ్రేడ్ చేస్తే.. రీయింబర్స్మెంట్ ఇవ్వాలనే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. విమానయాన సంస్థలు ఏకపక్షంగా డౌన్గ్రేడ్ చేస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తుండడంతో.. డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుని.. కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. దీని ప్రకారం టికెట్ను డౌన్గ్రేడ్ చేస్తే.. దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని.. సంబంధిత ప్రయాణికుడికి ఎయిర్లైన్స్…
Air India modifies in-flight alcohol service policy: ఇటీవల ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్రవిసర్జన సంఘటన దేశ ఏమియేషన్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం సేవించి ఓ సీనియర్ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. విమానంలో ప్రయాణికులు వికృత చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన మరో ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు.
Fight In Flight: విమానాల్లో ప్రయాణికుల వికృత చర్యలకు అడ్డుకట్టపడటం లేదు. ఇటీవల మూత్రవిసర్జన సంఘటన తర్వాత డీజీసీఏ ప్రయాణికుల ప్రవర్తనపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం ఢిల్లీ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. విమాన సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. ప్రయాణికుడిపై సెక్షన్ 354ఏ కింద…
Air India Fined 30 Lakhs, Pilot's Licence Suspended For 3 Months: గతేడాది నవంబర్ నెలలో న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో ఓ ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన సంఘటన దేశ విమానయాన రంగంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై విమానయాన రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై ఆగ్రహంతో ఉంది. ఈ మేరకు డీజీసీఏ చర్యలు ప్రారంభించింది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు…
Congress claims Tejasvi Surya opened emergency exit on IndiGo flight: బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు, బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య చిక్కుల్లో ఇరుకున్నారు. గత నెలలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం, డిసెంబరు 10న, చెన్నై నుండి తిరుచిరాపల్లికి వెళ్లే ఇండిగో 6ఈ ఫ్లైట్ 6ఈ-7339 నేలపై ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచినట్లు…