Go First: గో ఫస్ట్ ఎయిర్లైన్స్ దివాళా.. 3 రోజలు పాటు ఫ్లైట్స్ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Go First: దేశంలో ప్రైవేటు రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన గోఫస్ట్ దివాళా తీసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సంస్థ ఈ రోజు జాతీయ లా ట్రిబ్యునల్ ముందు దివాళా పిటిషన్ దాఖలు చేసింది. 27 దేశీయ గమ్యస్థానాలతో పాటు 7 అంతర్జాతీయ నగరాలకు గో ఫస్ట్ విమాన సేవల్ని అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఎయిర్ లైనర్ గా ఉంది.
Read Also: CM KCR: కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
Also Read
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థకు యూఎస్ కంపెనీ అయిన ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ నుంచి విమానాల ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగా నిధుల కొరత తలెత్తినట్లు ఆ సంస్థ సీఈఓ కౌశిక్ కోనా తెలిపారు. ఈ నేపథ్యంలోనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గో ఫస్ట్ కు చెందిన 28 విమానాలు నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్లు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, నిధుల కొరత ఏర్పడిందని ఆయన వెల్లడించారు.
మరోవైపు ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లు ఫెయిల్ అవుతుండటం కూడా గోఫస్ట్ ను దెబ్బతీస్తోంది. ఈ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లలో ఫాల్ట్ ఉన్న ఇంజిన్ల కారణంగా నడవకుండా ఉన్న విమానాల సంఖ్య డిసెంబర్ 2019లో 7 శాతం నుండి డిసెంబర్ 2020లో 31 శాతానికి పెరిగి డిసెంబర్ 2022 నాటికి 50 శాతానికి చేరిందని ఎయిర్లైన్ తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాట్ & విట్నీ స్పేర్ లీజు ఇంజిన్లను అందించడంలో విఫలమైతే, విమానాలకు మరిన్ని ఇంజిన్ల ఫెయిల్యూర్స్ తతెత్తితే ఈ ఎయిర్ లైన్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. గో ఫస్ట్ 5,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. తన వెబ్సైట్లో, విమానయాన సంస్థ తమ ఫ్లీట్లో 59 విమానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గోఫస్ట్ తదుపరి 3 రోజుల పాటు అన్ని విమానాలను రద్దు చేసింది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపసు చేస్తామని ప్రకటించింది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!