Go First: గో ఫస్ట్ ఎయిర్లైన్స్ దివాళా.. 3 రోజలు పాటు ఫ్లైట్స్ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Go First: దేశంలో ప్రైవేటు రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన గోఫస్ట్ దివాళా తీసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సంస్థ ఈ రోజు జాతీయ లా ట్రిబ్యునల్ ముందు దివాళా పిటిషన్ దాఖలు చేసింది. 27 దేశీయ గమ్యస్థానాలతో పాటు 7 అంతర్జాతీయ నగరాలకు గో ఫస్ట్ విమాన సేవల్ని అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఎయిర్ లైనర్ గా ఉంది.
Read Also: CM KCR: కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థకు యూఎస్ కంపెనీ అయిన ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ నుంచి విమానాల ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగా నిధుల కొరత తలెత్తినట్లు ఆ సంస్థ సీఈఓ కౌశిక్ కోనా తెలిపారు. ఈ నేపథ్యంలోనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గో ఫస్ట్ కు చెందిన 28 విమానాలు నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్లు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, నిధుల కొరత ఏర్పడిందని ఆయన వెల్లడించారు.
మరోవైపు ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లు ఫెయిల్ అవుతుండటం కూడా గోఫస్ట్ ను దెబ్బతీస్తోంది. ఈ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లలో ఫాల్ట్ ఉన్న ఇంజిన్ల కారణంగా నడవకుండా ఉన్న విమానాల సంఖ్య డిసెంబర్ 2019లో 7 శాతం నుండి డిసెంబర్ 2020లో 31 శాతానికి పెరిగి డిసెంబర్ 2022 నాటికి 50 శాతానికి చేరిందని ఎయిర్లైన్ తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాట్ & విట్నీ స్పేర్ లీజు ఇంజిన్లను అందించడంలో విఫలమైతే, విమానాలకు మరిన్ని ఇంజిన్ల ఫెయిల్యూర్స్ తతెత్తితే ఈ ఎయిర్ లైన్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. గో ఫస్ట్ 5,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. తన వెబ్సైట్లో, విమానయాన సంస్థ తమ ఫ్లీట్లో 59 విమానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గోఫస్ట్ తదుపరి 3 రోజుల పాటు అన్ని విమానాలను రద్దు చేసింది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపసు చేస్తామని ప్రకటించింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!