Go First: గో ఫస్ట్ ఎయిర్లైన్స్ దివాళా.. 3 రోజలు పాటు ఫ్లైట్స్ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Go First: దేశంలో ప్రైవేటు రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన గోఫస్ట్ దివాళా తీసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సంస్థ ఈ రోజు జాతీయ లా ట్రిబ్యునల్ ముందు దివాళా పిటిషన్ దాఖలు చేసింది. 27 దేశీయ గమ్యస్థానాలతో పాటు 7 అంతర్జాతీయ నగరాలకు గో ఫస్ట్ విమాన సేవల్ని అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఎయిర్ లైనర్ గా ఉంది.
Read Also: CM KCR: కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థకు యూఎస్ కంపెనీ అయిన ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ నుంచి విమానాల ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగా నిధుల కొరత తలెత్తినట్లు ఆ సంస్థ సీఈఓ కౌశిక్ కోనా తెలిపారు. ఈ నేపథ్యంలోనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గో ఫస్ట్ కు చెందిన 28 విమానాలు నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్లు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, నిధుల కొరత ఏర్పడిందని ఆయన వెల్లడించారు.
మరోవైపు ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లు ఫెయిల్ అవుతుండటం కూడా గోఫస్ట్ ను దెబ్బతీస్తోంది. ఈ సంస్థ సరఫరా చేస్తున్న ఇంజిన్లలో ఫాల్ట్ ఉన్న ఇంజిన్ల కారణంగా నడవకుండా ఉన్న విమానాల సంఖ్య డిసెంబర్ 2019లో 7 శాతం నుండి డిసెంబర్ 2020లో 31 శాతానికి పెరిగి డిసెంబర్ 2022 నాటికి 50 శాతానికి చేరిందని ఎయిర్లైన్ తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాట్ & విట్నీ స్పేర్ లీజు ఇంజిన్లను అందించడంలో విఫలమైతే, విమానాలకు మరిన్ని ఇంజిన్ల ఫెయిల్యూర్స్ తతెత్తితే ఈ ఎయిర్ లైన్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. గో ఫస్ట్ 5,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. తన వెబ్సైట్లో, విమానయాన సంస్థ తమ ఫ్లీట్లో 59 విమానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గోఫస్ట్ తదుపరి 3 రోజుల పాటు అన్ని విమానాలను రద్దు చేసింది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపసు చేస్తామని ప్రకటించింది.
తాజావార్తలు
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!