Go First Troubles: ‘ఫస్ట్’.. మా విమానాలు మాకిచ్చేయండి. ఆ తర్వాత.. మీరేమైనా చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Go First Troubles: వ్యాపారం అన్న తర్వాత ఎన్నో విషయాలు గోప్యంగా ఉంటాయి. వ్యవహారం మంచిగా నడుస్తున్నప్పుడు ఏవీ బయటికి రావు. బిజినెస్ ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేసిందో.. ఇక ఒకదాని తర్వాత ఒకటి బట్టబయలు అవుతాయి. దీనికి తాజా ఉదాహరణగా గోఫస్ట్ గురించి చెప్పుకోవచ్చు. ఈ సంస్థ దగ్గర ఎన్ని విమానాలు ఉన్నాయి?, అవి ఆ కంపెనీ సొంతమా? (లేక) లీజుకు తీసుకున్నవా? అనే అంశాలు సాధారణ జనానికి ఎవరికీ తెలియవు. కానీ.. ఇప్పుడు తెర మీదికి వస్తున్నాయి.
read more: Low Cost Electric Bike: ఇంతకన్నా తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ బైక్ రావటం కష్టమే
Also Read
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
- Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్... కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
గోఫస్ట్ సంస్థకు లీజుకిచ్చిన 20 విమానాలను తమకు తిరిగివ్వాలని కొన్ని కంపెనీలు కోరుతున్నాయి. ఈ మేరకు విమానయాన నియంత్రణాధికార సంస్థ.. డీజీసీఏ తలుపుతట్టాయి. విమానాలను రూల్స్ ప్రకారం తమకు ఇచ్చేసి, డీజిసర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాయి. స్వచ్ఛంద దివాలా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ గోఫస్ట్ సంస్థ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కి అప్లై చేసిన సంగతి తెలిసిందే. వివిధ కంపెనీలకు తాము చేయాల్సిన పేమెంట్లపై మారటోరియం విధించాలని కూడా గోఫస్ట్ రిక్వెస్ట్ చేసింది.
అయితే.. ఈ మారటోరియం విజ్ఞప్తిని సైతం లీజు సంస్థలు తప్పుపట్టాయి. ఈ కంపెనీల లిస్టులో.. సీడీబీ ఏవియేషన్, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్, సోనోరాన్ ఏవియేషన్ కంపెనీలు ఉన్నాయి. ఈ విషయాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నెల రెండో తేదీ నాటికి.. గోఫస్ట్ వద్ద ఎయిర్బస్ ఏ320 నియో విమానాలు 20 ఉండగా వాటిలో 15 మాత్రమే రాకపోకలు సాగించాయి. అనంతరం.. ఈ సర్వీసులన్నింటినీ గోఫస్ట్ ఈ నెల 12వ తేదీ వరకు క్యాన్సిల్ చేసింది.
ఇదిలాఉండగా.. పేమెంట్లపై మారటోరియం విధించాలన్న తమ విజ్ఞప్తిని లీజు సంస్థలు వ్యతిరేకించటంపై గోఫస్ట్ స్పందించింది. దివాలా ప్రక్రియకు స్వచ్ఛందంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించింది. కంపెనీని కాపాడుకోవటానికే తప్ప రుణదాతలకు బకాయిల చెల్లింపులను నిలిపివేయటం కోసం కాదని స్పష్టం చేసింది. సంస్థలో పనిచేస్తున్న 7 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని అత్యవసర మధ్యంతర మారటోరియానికి అనుమతించాలని కోరింది.
వాడియా గ్రూప్ కంపెనీ అయిన గోఫస్ట్.. ప్రస్తుతానికి.. వివిధ సంస్థలకు 11 వేల 463 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ సంస్థ దివాలా ప్రక్రియకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను ఎన్సీఎల్టీ ఎల్లుండి సోమవారం విచారణకు చేపట్టనుంది. అప్పుడుగాని.. గోఫస్ట్ భవితవ్యం ఏంటనేది తేలదు.
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!