Go First Troubles: ‘ఫస్ట్’.. మా విమానాలు మాకిచ్చేయండి. ఆ తర్వాత.. మీరేమైనా చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Go First Troubles: వ్యాపారం అన్న తర్వాత ఎన్నో విషయాలు గోప్యంగా ఉంటాయి. వ్యవహారం మంచిగా నడుస్తున్నప్పుడు ఏవీ బయటికి రావు. బిజినెస్ ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేసిందో.. ఇక ఒకదాని తర్వాత ఒకటి బట్టబయలు అవుతాయి. దీనికి తాజా ఉదాహరణగా గోఫస్ట్ గురించి చెప్పుకోవచ్చు. ఈ సంస్థ దగ్గర ఎన్ని విమానాలు ఉన్నాయి?, అవి ఆ కంపెనీ సొంతమా? (లేక) లీజుకు తీసుకున్నవా? అనే అంశాలు సాధారణ జనానికి ఎవరికీ తెలియవు. కానీ.. ఇప్పుడు తెర మీదికి వస్తున్నాయి.
read more: Low Cost Electric Bike: ఇంతకన్నా తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ బైక్ రావటం కష్టమే
Also Read
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
- Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
గోఫస్ట్ సంస్థకు లీజుకిచ్చిన 20 విమానాలను తమకు తిరిగివ్వాలని కొన్ని కంపెనీలు కోరుతున్నాయి. ఈ మేరకు విమానయాన నియంత్రణాధికార సంస్థ.. డీజీసీఏ తలుపుతట్టాయి. విమానాలను రూల్స్ ప్రకారం తమకు ఇచ్చేసి, డీజిసర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాయి. స్వచ్ఛంద దివాలా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ గోఫస్ట్ సంస్థ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కి అప్లై చేసిన సంగతి తెలిసిందే. వివిధ కంపెనీలకు తాము చేయాల్సిన పేమెంట్లపై మారటోరియం విధించాలని కూడా గోఫస్ట్ రిక్వెస్ట్ చేసింది.
అయితే.. ఈ మారటోరియం విజ్ఞప్తిని సైతం లీజు సంస్థలు తప్పుపట్టాయి. ఈ కంపెనీల లిస్టులో.. సీడీబీ ఏవియేషన్, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్, సోనోరాన్ ఏవియేషన్ కంపెనీలు ఉన్నాయి. ఈ విషయాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నెల రెండో తేదీ నాటికి.. గోఫస్ట్ వద్ద ఎయిర్బస్ ఏ320 నియో విమానాలు 20 ఉండగా వాటిలో 15 మాత్రమే రాకపోకలు సాగించాయి. అనంతరం.. ఈ సర్వీసులన్నింటినీ గోఫస్ట్ ఈ నెల 12వ తేదీ వరకు క్యాన్సిల్ చేసింది.
ఇదిలాఉండగా.. పేమెంట్లపై మారటోరియం విధించాలన్న తమ విజ్ఞప్తిని లీజు సంస్థలు వ్యతిరేకించటంపై గోఫస్ట్ స్పందించింది. దివాలా ప్రక్రియకు స్వచ్ఛందంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించింది. కంపెనీని కాపాడుకోవటానికే తప్ప రుణదాతలకు బకాయిల చెల్లింపులను నిలిపివేయటం కోసం కాదని స్పష్టం చేసింది. సంస్థలో పనిచేస్తున్న 7 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని అత్యవసర మధ్యంతర మారటోరియానికి అనుమతించాలని కోరింది.
వాడియా గ్రూప్ కంపెనీ అయిన గోఫస్ట్.. ప్రస్తుతానికి.. వివిధ సంస్థలకు 11 వేల 463 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ సంస్థ దివాలా ప్రక్రియకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను ఎన్సీఎల్టీ ఎల్లుండి సోమవారం విచారణకు చేపట్టనుంది. అప్పుడుగాని.. గోఫస్ట్ భవితవ్యం ఏంటనేది తేలదు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!