DGCA: 2021 నుండి నో ఫ్లై లిస్ట్లో 166 మంది.. వారి అనుచిత ప్రవర్తనే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGCA: ఇటీవలి కాలంలో విమానాల్లో ప్రయాణికుల చెడు ప్రవర్తనకు సంబంధించి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికులు తమ సహ ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేస్తున్నారు. కొన్నిచోట్ల విమాన సిబ్బంది లేదా విమాన సహాయక సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి ప్రవర్తన కారణంగా కొంతమంది ప్రయాణీకులు ఎయిర్ ఫ్లైట్లను ఎక్కకుండా నిషేధించబడ్డారు. 2021 సంవత్సరంలో DGCA అలాంటి వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెట్టారు.
Read Also:Nicholas Pooran Fine: పూరన్కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణం ఏంటంటే!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
2021లో ‘నో ఫ్లై లిస్ట్’ ప్రారంభమైనప్పటి నుండి ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇప్పటివరకు 166 మంది ప్రయాణికులను ఈ జాబితాలో చేర్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం పార్లమెంట్లో సమాచారం అందించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో వెల్లడించింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ 2020లో ప్రయాణికులు చేసిన ఫిర్యాదుల సంఖ్య 4,786 అని వ్రాతపూర్వక సమాధానంలో రాజ్యసభకు తెలిపారు.. 2021లో 5,321, 2022లో 5,525, ఈ సంవత్సరం జనవరి నుండి 2,384గా తెలిసారు. 2014లో దేశంలో షెడ్యూల్డ్ ఆపరేటర్ల సముదాయంలో మొత్తం 395 విమానాలు ఉన్నాయని, 2023 నాటికి వాటి సంఖ్య 729కి పెరిగిందని ఆయన చెప్పారు.
Read Also:Vizag Road Accident: రుషికొండ బీచ్ వద్ద కారు బీభత్సం.. బైక్ని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 2300 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయి. 2021 సంవత్సరం నుండి నో ఫ్లై జాబితాను విడుదల చేసిన తర్వాత అన్ని ఫిర్యాదులను DGCA పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. DGCA నుండి అందిన సమాచారం ప్రకారం.. దేశంలోని ప్రధాన దేశీయ విమానయాన సంస్థల మొత్తం విమానాల పరిమాణం వచ్చే ఏడేళ్లలో దాదాపు 1,600 వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు ఉన్న డేటా ప్రకారం.. రద్దు చేయబడిన విమానాల నిష్పత్తి 0.58 శాతంగా ఉందని ఆయన చెప్పారు. బీజేపీ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ ప్రశ్నలకు వీకే సింగ్ సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?