DGCA: 2021 నుండి నో ఫ్లై లిస్ట్లో 166 మంది.. వారి అనుచిత ప్రవర్తనే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGCA: ఇటీవలి కాలంలో విమానాల్లో ప్రయాణికుల చెడు ప్రవర్తనకు సంబంధించి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికులు తమ సహ ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేస్తున్నారు. కొన్నిచోట్ల విమాన సిబ్బంది లేదా విమాన సహాయక సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి ప్రవర్తన కారణంగా కొంతమంది ప్రయాణీకులు ఎయిర్ ఫ్లైట్లను ఎక్కకుండా నిషేధించబడ్డారు. 2021 సంవత్సరంలో DGCA అలాంటి వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెట్టారు.
Read Also:Nicholas Pooran Fine: పూరన్కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణం ఏంటంటే!
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
2021లో ‘నో ఫ్లై లిస్ట్’ ప్రారంభమైనప్పటి నుండి ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇప్పటివరకు 166 మంది ప్రయాణికులను ఈ జాబితాలో చేర్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం పార్లమెంట్లో సమాచారం అందించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో వెల్లడించింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ 2020లో ప్రయాణికులు చేసిన ఫిర్యాదుల సంఖ్య 4,786 అని వ్రాతపూర్వక సమాధానంలో రాజ్యసభకు తెలిపారు.. 2021లో 5,321, 2022లో 5,525, ఈ సంవత్సరం జనవరి నుండి 2,384గా తెలిసారు. 2014లో దేశంలో షెడ్యూల్డ్ ఆపరేటర్ల సముదాయంలో మొత్తం 395 విమానాలు ఉన్నాయని, 2023 నాటికి వాటి సంఖ్య 729కి పెరిగిందని ఆయన చెప్పారు.
Read Also:Vizag Road Accident: రుషికొండ బీచ్ వద్ద కారు బీభత్సం.. బైక్ని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 2300 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయి. 2021 సంవత్సరం నుండి నో ఫ్లై జాబితాను విడుదల చేసిన తర్వాత అన్ని ఫిర్యాదులను DGCA పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. DGCA నుండి అందిన సమాచారం ప్రకారం.. దేశంలోని ప్రధాన దేశీయ విమానయాన సంస్థల మొత్తం విమానాల పరిమాణం వచ్చే ఏడేళ్లలో దాదాపు 1,600 వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు ఉన్న డేటా ప్రకారం.. రద్దు చేయబడిన విమానాల నిష్పత్తి 0.58 శాతంగా ఉందని ఆయన చెప్పారు. బీజేపీ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ ప్రశ్నలకు వీకే సింగ్ సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!