దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వెంటాడుతోంది. గాలి నాణ్యత కోల్పోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య నియంత్రణ కోసం కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం రూ.3.21 కోట్లు కేటాయించింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఐసిస్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సాదిక్ నగర్కు చెందిన ఎండీ అద్నాన్ ఖాన్, అలియాస్ అబూ ముహారిబ్ (19), భోపాల్కు చెందిన అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ మొహమ్మద్ (20) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరిశ్రమపై అధికారుల బృందం దాడులు చేశాయి. రూ.108 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం 4 గంటలకు పోలీసులకు-వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియా మధ్య కాల్పులు జరిగాయి. మొదట నేరస్థుడు కాల్పులు జరపగా.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. ఐసిస్ ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్లో ఒకరు.. సౌత్ ఢిల్లీలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వేధిస్తోంది. దీపావళి దగ్గర నుంచి పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. గాలి నాణ్యత పూర్తిగా కోల్పోయింది. దీంతో కాలుష్య నివారణ కట్టడికి రేఖా గుప్తా ప్రభుత్వం పూనుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. దీనికి దీపావళి పండుగ తోడైంది. నిన్నటిదాకా ఒకెత్తు.. ఈరోజు మరొకెత్తుగా మారిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఎంత నష్టం జరిగింది. ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
విద్యార్థి సంఘాల ఎన్నికల ముందు ఢిల్లీ జేఎన్యూలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా విభజన వ్యాఖ్య హింసకు ప్రేరేపించింది. జేఎన్యూ క్యాంపస్లో యూపీ, బీహార్ విద్యార్థులు ఉండటానికి అర్హులు కాదని.. వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపించాలని ఒక వర్గం వారు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.
Supreme Court: వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.