Namakkal Egg Exports: కుప్పకూలిన గుడ్డు ధరలు.. రోజుకు రూ.5 కోట్ల నష్టం!
- సుమారు 1 కోటి గుడ్లుపై యుద్ధం ఎఫెక్ట్
- మార్చి 1 నుంచి పూర్తిగా ఆగిపోయిన సరఫరా
- రూ.4.30 పడిపోయిన ఒక గుడ్డు ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namakkal Egg Exports: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు తమిళనాడులోని నామక్కల్ కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీశాయి. భారతదేశపు అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో, స్థానిక రైతులు, ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు, గగనతలంపై ఆంక్షలు విధించడంతో, నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు (యూఏఈ, ఒమన్, ఖతార్) జరిగే గుడ్ల సరఫరా మార్చి 1 నుంచి పూర్తిగా ఆగిపోయింది.
READ ALSO: Reusing Cooking Oil: మరిగిన నూనెను తిరిగి ఉపయోగిస్తున్నారా..? సురక్షితంగా ఇలా వాడండి..!
Also Read
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
పడిపోయిన ధరలు.. కుదేలైన రైతులు
ఎగుమతులు నిలిచిపోవడంతో రోజుకు సుమారు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. యుద్ధం కారణంగా సుమారు 1 కోటి గుడ్లు కోల్డ్ స్టోరేజీలు, ప్యాకింగ్ సెంటర్లలోనే ఉండిపోయాయి. ఇవి త్వరగా పాడయ్యే వస్తువులు కావడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు ఆగిపోవడంతో ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్కు మళ్లాయి. దీనివల్ల దేశీయంగా గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) గుడ్డు ధరను రూ.4.30 గా నిర్ణయించినప్పటికీ, నష్టాలను తగ్గించుకోవడానికి రైతులు రూ.3.50 కే విక్రయించాల్సి వస్తోంది. ఒక గుడ్డు ఉత్పత్తికి రైతుకు రూ.4.50 ఖర్చవుతుండగా, అమ్మకపు ధర అంతకంటే తక్కువగా ఉండటం కోళ్ల ఫారాల యజమానులను అప్పుల ఊబిలోకి నెడుతోంది.
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నామక్కల్ ఎగుమతిదారులు కోరుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరిపి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సురక్షిత మార్గాన్ని (Safe Passage) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యుద్ధం ప్రభావం కేవలం గుడ్లపైనే కాకుండా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కూడా పడింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా కూడా నిలిచిపోయింది.
READ ALSO: Sanju Samson: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సంజు శాంసన్ తండ్రి! కారణం ఇదే..
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!