Namakkal Egg Exports: కుప్పకూలిన గుడ్డు ధరలు.. రోజుకు రూ.5 కోట్ల నష్టం!
- సుమారు 1 కోటి గుడ్లుపై యుద్ధం ఎఫెక్ట్
- మార్చి 1 నుంచి పూర్తిగా ఆగిపోయిన సరఫరా
- రూ.4.30 పడిపోయిన ఒక గుడ్డు ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namakkal Egg Exports: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు తమిళనాడులోని నామక్కల్ కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీశాయి. భారతదేశపు అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో, స్థానిక రైతులు, ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు, గగనతలంపై ఆంక్షలు విధించడంతో, నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు (యూఏఈ, ఒమన్, ఖతార్) జరిగే గుడ్ల సరఫరా మార్చి 1 నుంచి పూర్తిగా ఆగిపోయింది.
READ ALSO: Reusing Cooking Oil: మరిగిన నూనెను తిరిగి ఉపయోగిస్తున్నారా..? సురక్షితంగా ఇలా వాడండి..!
Also Read
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
పడిపోయిన ధరలు.. కుదేలైన రైతులు
ఎగుమతులు నిలిచిపోవడంతో రోజుకు సుమారు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. యుద్ధం కారణంగా సుమారు 1 కోటి గుడ్లు కోల్డ్ స్టోరేజీలు, ప్యాకింగ్ సెంటర్లలోనే ఉండిపోయాయి. ఇవి త్వరగా పాడయ్యే వస్తువులు కావడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు ఆగిపోవడంతో ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్కు మళ్లాయి. దీనివల్ల దేశీయంగా గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) గుడ్డు ధరను రూ.4.30 గా నిర్ణయించినప్పటికీ, నష్టాలను తగ్గించుకోవడానికి రైతులు రూ.3.50 కే విక్రయించాల్సి వస్తోంది. ఒక గుడ్డు ఉత్పత్తికి రైతుకు రూ.4.50 ఖర్చవుతుండగా, అమ్మకపు ధర అంతకంటే తక్కువగా ఉండటం కోళ్ల ఫారాల యజమానులను అప్పుల ఊబిలోకి నెడుతోంది.
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నామక్కల్ ఎగుమతిదారులు కోరుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరిపి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సురక్షిత మార్గాన్ని (Safe Passage) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యుద్ధం ప్రభావం కేవలం గుడ్లపైనే కాకుండా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కూడా పడింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా కూడా నిలిచిపోయింది.
READ ALSO: Sanju Samson: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సంజు శాంసన్ తండ్రి! కారణం ఇదే..
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!