Namakkal Egg Exports: కుప్పకూలిన గుడ్డు ధరలు.. రోజుకు రూ.5 కోట్ల నష్టం!
- సుమారు 1 కోటి గుడ్లుపై యుద్ధం ఎఫెక్ట్
- మార్చి 1 నుంచి పూర్తిగా ఆగిపోయిన సరఫరా
- రూ.4.30 పడిపోయిన ఒక గుడ్డు ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namakkal Egg Exports: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు తమిళనాడులోని నామక్కల్ కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీశాయి. భారతదేశపు అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో, స్థానిక రైతులు, ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు, గగనతలంపై ఆంక్షలు విధించడంతో, నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు (యూఏఈ, ఒమన్, ఖతార్) జరిగే గుడ్ల సరఫరా మార్చి 1 నుంచి పూర్తిగా ఆగిపోయింది.
READ ALSO: Reusing Cooking Oil: మరిగిన నూనెను తిరిగి ఉపయోగిస్తున్నారా..? సురక్షితంగా ఇలా వాడండి..!
Also Read
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. 'మునక్కాయ పచ్చడి' చేసేయండి ఇలా.!
పడిపోయిన ధరలు.. కుదేలైన రైతులు
ఎగుమతులు నిలిచిపోవడంతో రోజుకు సుమారు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. యుద్ధం కారణంగా సుమారు 1 కోటి గుడ్లు కోల్డ్ స్టోరేజీలు, ప్యాకింగ్ సెంటర్లలోనే ఉండిపోయాయి. ఇవి త్వరగా పాడయ్యే వస్తువులు కావడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు ఆగిపోవడంతో ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్కు మళ్లాయి. దీనివల్ల దేశీయంగా గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) గుడ్డు ధరను రూ.4.30 గా నిర్ణయించినప్పటికీ, నష్టాలను తగ్గించుకోవడానికి రైతులు రూ.3.50 కే విక్రయించాల్సి వస్తోంది. ఒక గుడ్డు ఉత్పత్తికి రైతుకు రూ.4.50 ఖర్చవుతుండగా, అమ్మకపు ధర అంతకంటే తక్కువగా ఉండటం కోళ్ల ఫారాల యజమానులను అప్పుల ఊబిలోకి నెడుతోంది.
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నామక్కల్ ఎగుమతిదారులు కోరుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరిపి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సురక్షిత మార్గాన్ని (Safe Passage) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యుద్ధం ప్రభావం కేవలం గుడ్లపైనే కాకుండా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కూడా పడింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా కూడా నిలిచిపోయింది.
READ ALSO: Sanju Samson: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సంజు శాంసన్ తండ్రి! కారణం ఇదే..
తాజావార్తలు
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!