Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలోని ఓ భవనంలో సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
Delhi Diwali Pollution: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో బాణసంచా కాల్చడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది.
Earthquake: ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఢిల్లీలో 2.6 తీవ్రతతో మధ్యామ్నం 3.36 గంటలకు భూకంపం సంభవించింది. నార్త్ డిస్ట్రిక్ట్ లో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.
Gambling: సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ భర్త. భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. తన భార్యను ఏం తెలియని నగరంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన యూపీలో అమ్రోహాలో జరిగింది. అయితే విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నిన్న ఏయిర్ పొల్యూషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంపై హర్యానా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేతను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే అని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దీంతో పాటే ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబులపై నిషేధం విధించాలని ఆప్ ప్రభుత్వానికి సూచించింది.
Delhi Pollution: ఢిల్లీ-ఎన్సీఆర్ కాలుష్యం ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలు గ్యాస్ ఛాంబర్లుగా మారాయి. గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన విభాగంలో ఉంది.
Delhi: ఢిల్లీలో ఓ స్కూల్ క్యాబ్ డ్రైవర్ అదే స్కూల్లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఢిల్లీలోని సంసద్ మార్గ్ లోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. నవంబర్ 3న బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం నుంచి బాలిక తండ్రికి సమాచారం అందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Delhi: ఉత్తర భారత దేశంలో పెరుగుతున్న కాలుష్యం అక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి పాఠశాలలు మూతబడ్డాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ తరుణంలో పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివారాలలోకి వెళ్తే.. ప్రతి సంవత్సరం ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పంట అవశేషాలను తగలబెడుతున్నారు. దీని కారణంగా ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా…
Delhi: ఢిల్లీలో కోరలు చాచిన గాలి కాలుష్యం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. గత వారం పది రోజులుగా ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం తార స్థాయికి చేరింది. దీనితో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తీవ్ర ప్రభావితం అవుతున్నాయి. చలికాలం ప్రారంభ లోనే కాలుష్య తీవ్రత రోజు రోజుకి తార స్థాయికి చేరుకోనంటోంది. ఉత్తర భారత దేశం లోని పలు ప్రాంతాలు కాలుష్యానికి అల్లాడుతున్నాయి. కాలుష్యం పెరగడం కారణంగా అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.…
Delhi: ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆదివారం 2200 మందికి చలాన్లు జారీ చేశారు.