త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
ఒక పరువు నష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో నేడు (సోమవారం) విచారణ జరుగనుంది.
కోస్ట్ గార్డ్ కు చెందిన మహిళా అధికారి పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. షార్ట్ సర్వీస్ కమిషన్కు అర్హులైన మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో విద్యార్థి హత్య సంచలనం రేపుతుంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థి హత్య చేశాడు. అందుకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల లోపల ఏదో చిన్న సమస్యపై వారిద్దరు గొడవ పడ్డారని.. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని ముఖంపై కొట్టాడని పోలీసులు…
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకల్లో మునిగితేలుతున్న.. బర్త్ డే బాయ్ పై రెస్టారెంట్ సిబ్బంది కత్తితో దాడి చేశారు. పితంపుర శివార్లలోని ఓ మాల్లో ఈ సంఘటన జరిగిది. 23 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. రెస్టారెంట్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచాడు.
Haldwani violence: ఉత్తరాఖండ్ హల్ద్వానీ ప్రాంతంలో ఫిబ్రవరి 8న తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు కోర్టు ఆదేశాల మేరకు కూల్చవేస్తున్న తరుణంలో హింస చోటు చేసుకుంది. పోలీసులు, ఇతర అధికారులే టార్గెట్గా స్థానికులు విరుచుకుపడ్డారు. పోలీసులను నిర్బంధించి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు వారిపై దాడి చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు.
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, గోవా, చండీగఢ్లలో సీట్ షేరింగ్కు రెండు పార్టీలు ఓకే చెప్పుకున్నాయి.
Uttar Pradesh: దొంగలు తెలివిమీరారు. ఐదో తరగతి చదువుకుని, ఆటో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే వ్యక్తి కార్ల దొంగతనాల కోసం పెద్ద ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. లగ్జరీ కార్లను దొంగతనం చేసేందుకు యూట్యూబ్, సాఫ్ట్వేర్ సాయంతో 500కి పైగా కార్లను దొంగతనం చేశారు. నిరక్షరాస్యులైనప్పటికీ.. యూట్యూబ్లో కార్ల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని అమలు చేశారు. తాజ్ మహ్మద్ అనే వ్యక్తి తొలిసారిగా రౌనక్ అలీ అలియాస్ బాబుతో పరిచయం పెంచుకున్నాడు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.