సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్లో ఒక్కసారిగా బలహీన పడ్డ కాంగ్రెస్.. ప్రస్తుతం అనూహ్యంగా కొత్త జోష్ వచ్చింది. ప్రాంతీయ పార్టీ అయిన జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది.
దేశంలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఖైదీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైదీలు జైలు లోపల ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు ఆరు చోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు జెట్ స్పీడ్గా సాగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కమలం గూటికి చేరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి చేరికలు జోరుగా సాగుతున్నాయి.
మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరం మరోసారి చెత్త రికార్డును దక్కించుకుంది. అత్యంత కాలుష్య రాజధానిలలో ఒకటిగా మరోసారి లిస్ట్ లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిలలో మరోసారి ఢిల్లీ పేరు నమోదైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ సంస్థ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, దేశ రాజధానుల జాబితాను తాజాగా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారంగా చూస్తే మనదేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాల్గవసారి ఎంపికైంది. Also Read: RRB…
సార్వత్రిక ఎన్నికల వేళ బహుజన సమాజ్వాదీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ ఎంపీ సంగీతా ఆజాద్ బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
Vadapav Girl: అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు చెప్తారు. అంటే ఏది అతిగా ఉండకూడదు అని అర్ధం. దానివల్లన ఎంత పేరు వస్తుందో.. అంతే వివాదాలు కూడా వస్తాయి. ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్ఫుడ్ బిజినెస్ను స్టార్ట్ చేసి 13 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిన్న రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. అటు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్ లో పాల్గొననున్నారు.