భార్యతో బలవంతపు శృంగారం నేరమా? మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ని నేరంగా పరిగణించాలా? అనే విషయం ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పును వెలువరించింది.. భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే, బెంచ్లోని మరో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు భారత రత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జీవితాంతం అవిశ్రాంతంగా సేవలను అందిస్తున్న రతన్టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా అసలు…
వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. మరింత గడువు కోరుతూ.. పిటిషన్ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది హైకోర్టు.. అయితే, పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కోరారు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్లకు ఫిబ్రవరి 10న అభిప్రాయ సేకరణకు సమాచారం అందించామని, అయితే, ఇంకా స్పందన రాలేదని కోర్టుకు తెలిపారు. కానీ, కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది…
ఢిల్లీ హైకోర్టు ఆక్తికరమైన పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానా బేగం అనే మహిళ… ఢిల్లీ రాజు బహదూర్ షా జాఫర్-2కు తానే నిజమైన వారసురాలినని ఉద్ఘాటించింది. దీంతో ఎర్రకోటను తనకు అప్పగించాలని లేదా తగిన పరిహారం చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ తన పిటిషన్ ద్వారా కోర్టును కోరింది. 1857లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వర్గాలు బహదూర్ షాను పదవీచ్యుతుడిని చేశాయని… బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ…
ప్రత్యేక, హిందూ, విదేశీ వివాహ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలను గుర్తించాలని దాఖలైన పిటిషన్లపై విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. అయితే దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రం స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సూచనలను స్వీకరించడానికి, సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం తరపు న్యాయవాదికి సమయం ఇచ్చింది. ఈ అంశాన్ని ఫిబ్రవరి 3న తదుపరి విచారణకు వాయిదా వేసింది.…
కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ కొత్త పుస్తకంపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మనోభావాలను దెబ్బతీస్తే, ప్రజలు ఇంకేదైనా చదవాలని పేర్కొంది. కోర్టు పిటిషనర్తో, “ప్రజలను కొనుగోలు చేయవద్దని లేదా చదవవద్దని మీరు ఎందుకు అడగరు? పుస్తకం తప్పుగా రచించబడిందని దానిని చదవవద్దని అందరికీ చెప్పండి. మనోభావాలు దెబ్బతింటుంటే, వారు ఇంకేదైనా చదువుతారని కోర్టు పేర్కొంది. కాగా, ఈ పుస్తకం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దీనిపై నిషేధం విధించాలని, వాక్, భావప్రకటనా స్వేచ్ఛను…
మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీజేఐ ఎన్.వి. రమణ. “గే” ని జడ్జిగా నియమిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సీనియర్ లాయర్ సౌరభ్ కిర్పాల్ పేరు సిఫార్సు చేసింది. గత మూడేళ్లుగా సౌరభ్ కిర్పాల్ పై నిర్ణయం తీసుకోలేదు కొలీజియం. సౌరభ్ కిర్పాల్ మాజీ సీజేఐ బీఎన్ కిర్పాల్ కుమారుడు. 2017లో మొదటిసారి సౌరభ్ కిర్పాల్ పేరును సిఫార్సు చేసింది ఢిల్లీ హైకోర్టు. విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని, జీవిత…
దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ఢీల్లీకి సరిహద్దున ఉన్న 14 జిల్లాల్లో కాకర్స్ కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఢీల్లీ సమీప జిల్లాల్లో కాలుష్యం పెరిగిపోతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాకర్స్ను కాల్చుకోవాలనుకుంటే కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కాల్చొచ్చు, కానీ అవికూడా గ్రీన్ కాకర్స్ అయి ఉండాలని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. గత నెలలో ఢీల్లీ పొల్యూషన్…
భారత నూతన ఐటీ చట్టాలను పాటించడంలో ట్విట్టర్ మనస్ఫూర్తిగా అడుగులు వెయ్యలేకపోతుంది. ఇప్పటికే పలుమార్లు ట్విటర్ ప్రతినిధులు, కేంద్రంతో చర్చలు జరిపిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక కేంద్రం ఏమాత్రం ట్విటర్ వాదనలు వినదల్చుకోలేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ట్విట్టర్ కు మొట్టికాయలు వేసింది. భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్కు రక్షణ కల్పించలేమని ఈరోజు విచారణలో తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని…
బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు గట్టి షాక్ తగిలింది.. 5జీ వైర్లెస్ నెట్వర్క్కు సంబంధించి ఇండియాలో ట్రయల్స్ను వ్యతిరేకిస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ ఆ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు.. ఆమెకు భారీగా జరిమానా విధించింది… జూహీ చావ్లా.. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని ఆ సందర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు.. కేవలం పబ్లిసిటీ కోసం ఈ పిటిషన్ వేసినట్టుగా ఉందని పేర్కొంది.. చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు గాను జూహీ చావ్లా సహా…