Goa Bar Row: స్మృతి ఇరానీ కుమార్తెకు ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court Gives Clean Chit To Smriti Irani Daughter Zoish Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి గోవాలో బార్ & రెస్టారెంట్ ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే! బీజేపీ vs కాంగ్రెస్ రాజకీయ పోరులో జోయిష్ను జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజా సీన్లోకి లాగారు. దీంతో తీవ్ర కోపాద్రిక్తురాలైన స్మృతి ఇరానీ.. ఢిల్లీ హైకోర్టులో ఆ ముగ్గురిపై పరువునష్టం దావా వేసింది. ఈ కేసుని విచారించిన ధర్మాసనం.. జోయిష్ ఇరానీ పేరుపై గోవాలో బార్ & రెస్టారెంట్ ఉన్నట్టు రికార్డుల్లో లేదని స్పష్టం చేసింది.
స్మృతి గానీ, ఆమె కూతురు గానీ గోవాలో బార్కు యజమానులు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కనీసం ఫుడ్ అండ్ బేవరేజెస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న దాఖలాలు కూడా లేవని వెల్లడించింది. అంతేకాదు.. స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై కాంగ్రెస్ నేతలు కుట్రపూరితంగానే తప్పుడు ఆరోపణలతో వ్యక్తిగత దాడులకు దిగినట్టు అర్థమవుతోందని ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పరువుప్రతిష్ఠలను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఈ వ్యక్తిగత ఆరోపణలు చేశారని భావిస్తున్నట్టు తెలిపింది.
Also Read
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
నిజానిజాలేంటో తెలుసుకోకుండా.. ఆ ముగ్గురు కాంగ్రెస్ నేతలు నిందారోపణలు చేశారని హైకోర్టు పేర్కొంది. ఇది స్మృతి ఇరానీ, ఆమె కుటుంబ సభ్యుల గౌరవాన్ని దెబ్బ తీసిందని తెలిపింది. దురుద్దేశంతోనే ఈ బూటకపు ప్రకటనలు చేశారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఆ ముగ్గురికి సమన్లు జారీచేసింది. ట్విట్టర్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!