Marital Rape: భార్యతో బలవంతపు శృంగారం.. భిన్న తీర్పులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యతో బలవంతపు శృంగారం నేరమా? మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ని నేరంగా పరిగణించాలా? అనే విషయం ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పును వెలువరించింది.. భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే, బెంచ్లోని మరో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని.. కావున, భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని పేర్కొన్నారు.. అంతేకాదు, జస్టిస్ రాజీవ్ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. దీంతో ఒకే కేసులో రెండు భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్టు అయ్యింది.
Read Also: Andhra Pradesh: మరికొన్ని గంటల్లో పెళ్ళి.. వరుడు గదిలోకి వెళ్ళి..
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
ఇక, చట్టం ద్వారా మంజూరు చేయబడిన మినహాయింపు ప్రకారం, స్త్రీ మైనర్ కానట్లయితే, తన భార్యతో పురుషుడు చేసే ఏదైనా లైంగిక చర్య అత్యాచారం కాదని పేర్కొంది హైకోర్టు.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై విస్తృతంగా చర్చనీయాంశమైన ప్రశ్నపై, ఢిల్లీ హైకోర్టు ఈరోజు భిన్నమైన తీర్పును వెలువరించింది. అయితే, ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ శక్ధేర్ మరియు జస్టిస్ హరిశంకర్ తమ తీర్పుపై ఏకీభవించడంలో విఫలమయ్యారు. వైవాహిక అత్యాచార చట్టంలో మినహాయింపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తాను నమ్ముతున్నానని జస్టిస్ శంకర్ అన్నారు.
కాగా, మారిటల్ రేప్ విచారణల తర్వాత అత్యాచార చట్టం కింద భర్తలకు ఇచ్చిన మినహాయింపును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు ఫిబ్రవరి 21న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై తన వైఖరిని స్పష్టం చేయడానికి ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి రెండు వారాల గడువు ఇచ్చింది. అయితే, కేంద్రం మరింత సమయం కోరింది, కేసును అనంతంగా వాయిదా వేయడం సాధ్యం కాదని న్యాయమూర్తులు తిరస్కరించారు. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వారి వ్యాఖ్యలను కోరుతూ ఒక కమ్యూనికేషన్ పంపినట్లు కేంద్రం తెలిపింది. ఈ కేసు సామాజిక మరియు కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతుందని, సుదూర పరిణామాలతో సంప్రదింపుల ప్రక్రియ అవసరమని కేంద్రం పేర్కొంది.
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?