Marital Rape: భార్యతో బలవంతపు శృంగారం.. భిన్న తీర్పులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యతో బలవంతపు శృంగారం నేరమా? మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ని నేరంగా పరిగణించాలా? అనే విషయం ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పును వెలువరించింది.. భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే, బెంచ్లోని మరో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని.. కావున, భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని పేర్కొన్నారు.. అంతేకాదు, జస్టిస్ రాజీవ్ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. దీంతో ఒకే కేసులో రెండు భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్టు అయ్యింది.
Read Also: Andhra Pradesh: మరికొన్ని గంటల్లో పెళ్ళి.. వరుడు గదిలోకి వెళ్ళి..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇక, చట్టం ద్వారా మంజూరు చేయబడిన మినహాయింపు ప్రకారం, స్త్రీ మైనర్ కానట్లయితే, తన భార్యతో పురుషుడు చేసే ఏదైనా లైంగిక చర్య అత్యాచారం కాదని పేర్కొంది హైకోర్టు.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై విస్తృతంగా చర్చనీయాంశమైన ప్రశ్నపై, ఢిల్లీ హైకోర్టు ఈరోజు భిన్నమైన తీర్పును వెలువరించింది. అయితే, ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ శక్ధేర్ మరియు జస్టిస్ హరిశంకర్ తమ తీర్పుపై ఏకీభవించడంలో విఫలమయ్యారు. వైవాహిక అత్యాచార చట్టంలో మినహాయింపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తాను నమ్ముతున్నానని జస్టిస్ శంకర్ అన్నారు.
కాగా, మారిటల్ రేప్ విచారణల తర్వాత అత్యాచార చట్టం కింద భర్తలకు ఇచ్చిన మినహాయింపును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు ఫిబ్రవరి 21న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై తన వైఖరిని స్పష్టం చేయడానికి ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి రెండు వారాల గడువు ఇచ్చింది. అయితే, కేంద్రం మరింత సమయం కోరింది, కేసును అనంతంగా వాయిదా వేయడం సాధ్యం కాదని న్యాయమూర్తులు తిరస్కరించారు. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వారి వ్యాఖ్యలను కోరుతూ ఒక కమ్యూనికేషన్ పంపినట్లు కేంద్రం తెలిపింది. ఈ కేసు సామాజిక మరియు కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతుందని, సుదూర పరిణామాలతో సంప్రదింపుల ప్రక్రియ అవసరమని కేంద్రం పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!