Cyber Fraud: ఢిల్లీ హైకోర్టు జడ్జి వాట్సాప్ డీపీతో ఘరానా మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud With Delhi High Court Justice Satish Chandra Sharma WhatsApp DP: సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, జాగ్రత్తలు సూచిస్తున్నా.. అవి ఆగడం లేదు. సైబర్ నేరగాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. జనాలకు కుచ్చటోపీ వేస్తూనే ఉన్నారు. లక్షలు, కోట్ల రూపాయల్ని నిలువునా దోచేస్తున్నారు. జనాలు పక్కాగా నమ్మేలా, కొత్త కొత్త వ్యూహాలకు తెరలేపుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాట్సాప్ డీపీతోనే వీళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ సతీష్ చంద్రశర్మ.. ఇటీవలే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈయన వాట్సాప్ డీపీ నుంచి తెలంగాణ హైకోర్టులో పని చేస్తోన్న శ్రీమన్నారాయణకు ఓ మెసేజ్ వచ్చింది. తానిప్పుడు ఓ సమావేశంలో ఉన్నానని, తనకు రూ. 2 లక్షలు అత్యవసరం ఉన్నాయని, తన దగ్గరున్న కార్డులన్నీ బ్లాక్ అయ్యాయని ఆ మెసేజ్లో రాసి ఉంది. అంతేకాదు.. తనకు నేరుగా డబ్బులు పంపొద్దని, రూ. 2 లక్షల విలువ చేసే గినా కార్డుకి సంబంధించిన అమెజాన్ లింక్ పంపుతున్నానని, దాన్ని క్లిక్ చేస్తే తన అకౌంట్లోకి డబ్బులు వచ్చిపడతాయని ఆ జడ్జి చెప్పినట్టు సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
జస్టిస్ సతీష్ చంద్రశర్మ డీపీ ఉండటంతో.. ఆ మెసేజ్ నిజమేనేమోనని శ్రీమన్నారాయణ నమ్మారు. ఆయనకు డబ్బులు అవసరమేమోనని, అమెజాన్ లింక్ని క్లిక్ చేశారు. ఆ తర్వాత ఆయనకు అసలు విషయం తెలిసింది. ఆ మెసేజ్ పంపింది జస్టిష్ సతీష్ కాదని, తాను మోసపోయానని శ్రీమన్నారాయణ గ్రహించారు. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇది నైజీరియాల పనిగా భావించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈమధ్య అమెజాన్ గిఫ్ట్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ సూచించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!