Cyber Fraud: ఢిల్లీ హైకోర్టు జడ్జి వాట్సాప్ డీపీతో ఘరానా మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud With Delhi High Court Justice Satish Chandra Sharma WhatsApp DP: సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, జాగ్రత్తలు సూచిస్తున్నా.. అవి ఆగడం లేదు. సైబర్ నేరగాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. జనాలకు కుచ్చటోపీ వేస్తూనే ఉన్నారు. లక్షలు, కోట్ల రూపాయల్ని నిలువునా దోచేస్తున్నారు. జనాలు పక్కాగా నమ్మేలా, కొత్త కొత్త వ్యూహాలకు తెరలేపుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాట్సాప్ డీపీతోనే వీళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ సతీష్ చంద్రశర్మ.. ఇటీవలే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈయన వాట్సాప్ డీపీ నుంచి తెలంగాణ హైకోర్టులో పని చేస్తోన్న శ్రీమన్నారాయణకు ఓ మెసేజ్ వచ్చింది. తానిప్పుడు ఓ సమావేశంలో ఉన్నానని, తనకు రూ. 2 లక్షలు అత్యవసరం ఉన్నాయని, తన దగ్గరున్న కార్డులన్నీ బ్లాక్ అయ్యాయని ఆ మెసేజ్లో రాసి ఉంది. అంతేకాదు.. తనకు నేరుగా డబ్బులు పంపొద్దని, రూ. 2 లక్షల విలువ చేసే గినా కార్డుకి సంబంధించిన అమెజాన్ లింక్ పంపుతున్నానని, దాన్ని క్లిక్ చేస్తే తన అకౌంట్లోకి డబ్బులు వచ్చిపడతాయని ఆ జడ్జి చెప్పినట్టు సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపారు.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
జస్టిస్ సతీష్ చంద్రశర్మ డీపీ ఉండటంతో.. ఆ మెసేజ్ నిజమేనేమోనని శ్రీమన్నారాయణ నమ్మారు. ఆయనకు డబ్బులు అవసరమేమోనని, అమెజాన్ లింక్ని క్లిక్ చేశారు. ఆ తర్వాత ఆయనకు అసలు విషయం తెలిసింది. ఆ మెసేజ్ పంపింది జస్టిష్ సతీష్ కాదని, తాను మోసపోయానని శ్రీమన్నారాయణ గ్రహించారు. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇది నైజీరియాల పనిగా భావించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈమధ్య అమెజాన్ గిఫ్ట్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ సూచించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!