Illegal Bar row: కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్ట్ షాక్.. ఆ పోస్టులను తొలగించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani defamation case on Illegal Bar allegations: కాంగ్రెస్ నేతలు ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తున్నాంటూ విమర్శించారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీ స్మృతి ఇరానీని తన పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్మృతి ఇరానీ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాకు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
స్మృతి ఇరానీ, ఆమె కూతురుపై చేసిన ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు, పోస్టులు, వీడియోలు, ఫోటోలను 24 గంటల్లో తొలగించాలని జస్టిస్ మినీ పుష్కర్ణ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు తమ ఆదేశాలను పాటించకపోతే.. ట్విట్టర్, యూట్యూబ్లు వీటన్నింటిని తొలగిస్తాయని ఆదేశాలు జారీ చేసింది. తన కూతురుపై నిరాధారణ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై రూ.2 కోట్లకు పరవు నష్టం దావా దాఖలు చేశారు. ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ దాఖలు చేసిన వ్యాజ్యంపై సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ కోర్టు ముందు వాస్తవాలు, సాక్ష్యాలు ఉంచేందుకు ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్ చేశారు.
Also Read
- PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపైస్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలను కోర్టుకు ఈడుస్తానని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీని అమేథీలో ఓడించినందుకే కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని..2024లో కూడా రాహుల్ గాంధీని ఓడిస్తానని సవాల్ విసిరారు. 18 ఏళ్ల నా కూతురు వ్యక్తిత్వాన్ని కాంగ్రెస్ మర్డర్ చేసిందంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!