Illegal Bar row: కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్ట్ షాక్.. ఆ పోస్టులను తొలగించాలని ఆదేశం
Smriti Irani defamation case on Illegal Bar allegations: కాంగ్రెస్ నేతలు ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తున్నాంటూ విమర్శించారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీ స్మృతి ఇరానీని తన పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్మృతి ఇరానీ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాకు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
స్మృతి ఇరానీ, ఆమె కూతురుపై చేసిన ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు, పోస్టులు, వీడియోలు, ఫోటోలను 24 గంటల్లో తొలగించాలని జస్టిస్ మినీ పుష్కర్ణ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు తమ ఆదేశాలను పాటించకపోతే.. ట్విట్టర్, యూట్యూబ్లు వీటన్నింటిని తొలగిస్తాయని ఆదేశాలు జారీ చేసింది. తన కూతురుపై నిరాధారణ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై రూ.2 కోట్లకు పరవు నష్టం దావా దాఖలు చేశారు. ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ దాఖలు చేసిన వ్యాజ్యంపై సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ కోర్టు ముందు వాస్తవాలు, సాక్ష్యాలు ఉంచేందుకు ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్ చేశారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపైస్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలను కోర్టుకు ఈడుస్తానని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీని అమేథీలో ఓడించినందుకే కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని..2024లో కూడా రాహుల్ గాంధీని ఓడిస్తానని సవాల్ విసిరారు. 18 ఏళ్ల నా కూతురు వ్యక్తిత్వాన్ని కాంగ్రెస్ మర్డర్ చేసిందంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!