Illegal Bar row: కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్ట్ షాక్.. ఆ పోస్టులను తొలగించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani defamation case on Illegal Bar allegations: కాంగ్రెస్ నేతలు ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తున్నాంటూ విమర్శించారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీ స్మృతి ఇరానీని తన పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్మృతి ఇరానీ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాకు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
స్మృతి ఇరానీ, ఆమె కూతురుపై చేసిన ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు, పోస్టులు, వీడియోలు, ఫోటోలను 24 గంటల్లో తొలగించాలని జస్టిస్ మినీ పుష్కర్ణ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు తమ ఆదేశాలను పాటించకపోతే.. ట్విట్టర్, యూట్యూబ్లు వీటన్నింటిని తొలగిస్తాయని ఆదేశాలు జారీ చేసింది. తన కూతురుపై నిరాధారణ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై రూ.2 కోట్లకు పరవు నష్టం దావా దాఖలు చేశారు. ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ దాఖలు చేసిన వ్యాజ్యంపై సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ కోర్టు ముందు వాస్తవాలు, సాక్ష్యాలు ఉంచేందుకు ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్ చేశారు.
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపైస్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలను కోర్టుకు ఈడుస్తానని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీని అమేథీలో ఓడించినందుకే కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని..2024లో కూడా రాహుల్ గాంధీని ఓడిస్తానని సవాల్ విసిరారు. 18 ఏళ్ల నా కూతురు వ్యక్తిత్వాన్ని కాంగ్రెస్ మర్డర్ చేసిందంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!