చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ వర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్ధగా వినడం ఆసక్తి కలిగించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఇవాళ ( శుక్రవారం ) కీలక మ్యాచ్ కు చెన్నై వేదికగా మారింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ కీలక లీగ్ మ్యాచ్ జరుగనుంది.
ధోని 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇకనైన తన ఇష్టం వచ్చినప్పుడు తప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి అని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్ అన్నారు. ఇష్టం లేకపోయినా అభిమానుల కోసం ఆడాలని కోరడం కరెక్ట్ కాదు.. ధోని ఎక్కడికి వెళ్లినా రిటైర్మింట్ ఎప్పుడు అనే ప్రశ్న వస్తోంది.. ఎప్పుడు చెప్పాలో మాహీకి తెలుసు.. ఇలా ప్రతీసారి అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. ధోని రిటైర్మెంట్ గురించి మళ్లీ మళ్లీ అడగకూడదని మురళీ విజయ్…
నేను ముంబై వాడిని కాబట్టి కుదిరితే ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు ఇష్టపడతా.. అది కుదరకపోతే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడతాను.. ఎందుకంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. చెన్నై ఫ్రాంఛైజీ యజమానులు, క్రికెట్ ని ఎంతో ప్రేమిస్తారు. టీమ్ లోని ప్లేయర్లను ఎంతో గౌరవం ఇస్తారు అని సన్నీ పేర్కొన్నాడు. ఆ టీమ్ ప్లేయర్లతో నడుచుకునే విధానం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అంటూ సునీల్ గవాస్కర్ అన్నారు.
Moeen Ali : భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ చివరి సీజన్లో ఆడుతున్నాడని క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతోంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో ధోనీ కెప్టెన్సీ, బ్యాటింగ్ను చూసి చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన తోటి ప్లేయర్ మొయిన్ అలీ వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతాడని జోస్యం చెప్పాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు ముందు ఇదే ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహేశ్ బాబును అభిమానించే వీరు.. చిన్నస్వామి స్టేడియం ముందు విరాట్-మహేశ్ బాబు పోస్టర్లతోహల్ చల్ చేశారు.
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్ లో బెన్ స్టోక్స్ బొటనవేలికి గాయమైంది. దీంతో అతను తర్వాత మ్యాచ్ లకు దూరమయ్యాడు. కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.