గాంధీ ఆస్పత్రిలో జరిగినఅత్యాచార ఘటనలో కొత్త ట్విస్టు వెలుగు చూసింది. మెడికల్ రిపోర్ట్ నమూనా పరీక్షల్లో… మత్తుమందు ప్రయోగం ఆనవాళ్లు కనిపించలేదు. ఇప్పుడీ మెడికల్ రిపోర్టే ఈ కేసులో.. కీలకంగా మారింది. తమకు నిందితులు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది బాధితురాలు. దీంతో బాధితురాలి నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించింది ఫొరెన్సిక్ బృందం. వీటిలో క్లోరోఫామ్ సహా ఇతర మత్తు పదార్థాలేవీ కనిపించలేదని.. నివేదిక ఇచ్చింది.ఇప్పటికే…
మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ 2 లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ కోసం తిరిగే బొలెరో వాహనం మీదకు డంపర్ ఎక్కింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మగ్గురు మృతి చెందినట్టు సమాచారం. సింగరేణిలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులతో పాటు బొలెరో డ్రైవర్ కూడా మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అంచనా వేస్తున్నారు. Read: ప్రాణాలకు తెగించి…
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గాంధీ ఆస్పత్రిలో కీచక పర్వం కలకలం రేపుతోంది. నిత్యం వందలాది మంది రోగులు వచ్చిపోయే గాంధీ ఆస్పత్రిలో.. తమపై గ్యాంగ్రేప్ జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అనారోగ్యంతో బాధపడుతున్న బావకు సహాయంగా అక్కతో పాటు తానుగాంధీ ఆస్పత్రికి వచ్చామని.. మత్తు మందిచ్చి, ఆస్పత్రి సెల్లార్లో లైంగికదాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది. మహబూబ్నగర్కు చెందిన ఓ వ్యక్తికి రెండు కిడ్నీలూ పాడైపోవడంతో … ఈ నెల 4న ఆయనను గాంధీ ఆస్పత్రిలో…
పంజాబ్లోని పాటియాలా నగరంలో ఓ కారు డ్రైవర్ చేసిన పని స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రెగ్యులర్ విధుల్లో భాగంగా పాటియాలాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ కారును కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. ఐతే కారు డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్ మీదకు దూసుకొచ్చాడు. కానిస్టేబుల్ తప్పుకునేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వకుండా ఢీకొట్టి పారిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.…
ఇంగ్లండ్లో సామూహిక కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లైమౌత్లో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఐదేండ్ల చిన్నారి ఉన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించాడని కార్న్వాల్ పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని ఘటనా స్థలంలో ఉన్న ఓ మహిళ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇది ఎలాంటి ఉగ్రవాద చర్యా కాదని స్పష్టం…
ప్రముఖ యాంకర్ గాయత్రి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. సోషల్ మీడియాకు ఆమడ దూరంగానే ఉండే గాయత్రి ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారు కొందరు కేటుగాళ్లు. అనంతరం ఆ అకౌంటర్ ద్వారా వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకర సందేశాలు షేర్ చేశారు. అయితే.. అభ్యంతరకర పోస్టులు పెట్టగానే… అలర్ట్ అయిన యాంకర్ గాయత్రి… తన ఫేస్ బుక్ ఖాతా ను ఎవరో హ్యాక్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే… ఈ కేసు పై సిటీ…
మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాల పై మరోమారు స్పందించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. పక్కరాష్ట్రంలో దిశ ఘటనలో సీపీ సజ్జనార్ చేసిన ఎన్ కౌంటర్ ను అందరూ స్వాగతించాలి అన్నారు. అలాగే అమ్మాయిల శీలాన్ని చెరచిన వాడు మగాడు కాదు మృగాడు. సజ్జనార్ చేసిన పని సమాజం నుంచి పుట్టుకొచ్చిన ఒక గొప్ప పాలసీ. న్యాయానికి న్యాయం జరగనపుడు సమాజంలోంచి ఒక న్యాయం పుట్టుకొస్తుంది . అదే సమాంతర న్యాయం. సమాంతర న్యాయంలో నో లా,…