Delhi: పబ్లిక్ ప్లేస్లో మందు తాగొద్దని చెప్పినందుకు కానిస్టేబుల్ హత్య..
- పబ్లిక్ ప్లేస్లో మందు తాగొద్దని చెప్పినందుకు దారుణం..
- పోలీస్ కానిస్టేబుల్ని చంపేసిన నిందితులు..
- ఢిల్లీలో ఘటన, ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు..
Delhi: పబ్లిక్ ప్లేస్లో మద్యం సేవించొద్దని మందలించినందుకు ఓ కానిస్టేబుల్ని ఇద్దరు చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 29న ఢిల్లీలో జరిగింది. ఔటర్ ఢిల్లీలో రోడ్డుపై మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను మందలించిన 30 ఏళ్ల కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై 400 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఛార్జిషీట్ ప్రకారం.. సందీప్ మాలిక్ సెప్టెంబర్ 29న సివిల్ దుస్తుల్లో నైట్ డ్యూటీ నిర్వహిస్తుండగా, నంగ్లోయ్ ప్రాంతంలో కారులో ధర్మేందర్(39), రజనీష్(25) మద్యం సేవించడాన్ని గమనించాడు. నిందితులిద్దర్ని మందలించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులు సందీప్ మాలిక్ బైక్ని ఢీకొట్టి 10 మీటర్ల వరకు లాక్కెళ్లారు. దీంతో సందీప్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతర పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
Read Also: 2024లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్లు ఎవరంటే..? (అన్ని ఫార్మాట్లలో)
ఇద్దరు వ్యక్తులు ధర్మేందర్, రజనీష్లను ప్రధాన నిందిలుగా చేర్చారు. మరో ఇద్దరు జితేందర్ అలియాస్ జీతు, మనోజ్ షరేమాన్లు ధర్మేందుర్కి ఆశ్రయం కల్పించినందుకు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ధర్మేందర్, రజనీష్లను అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్కి న్యాయం జరిగేలా ఛార్జిషీట్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నాగ్లోయ్లోని వీణా ఎన్క్లేవ్లో అదే ప్రాంతంలో నివసిస్తున్నందున నిందితులు సందీప్ మాలిక్కి తెలుసని దర్యాప్తులో తేలింది. హర్యానాలోని రోహ్తక్కి చెందిన సందీప్ మాలిక్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మేందర్ తన స్నేహితుడు అమిత్ నుంచి కారుని తీసుకున్నాడని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో