Delhi: పబ్లిక్ ప్లేస్లో మందు తాగొద్దని చెప్పినందుకు కానిస్టేబుల్ హత్య..
- పబ్లిక్ ప్లేస్లో మందు తాగొద్దని చెప్పినందుకు దారుణం..
- పోలీస్ కానిస్టేబుల్ని చంపేసిన నిందితులు..
- ఢిల్లీలో ఘటన, ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: పబ్లిక్ ప్లేస్లో మద్యం సేవించొద్దని మందలించినందుకు ఓ కానిస్టేబుల్ని ఇద్దరు చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 29న ఢిల్లీలో జరిగింది. ఔటర్ ఢిల్లీలో రోడ్డుపై మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను మందలించిన 30 ఏళ్ల కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై 400 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఛార్జిషీట్ ప్రకారం.. సందీప్ మాలిక్ సెప్టెంబర్ 29న సివిల్ దుస్తుల్లో నైట్ డ్యూటీ నిర్వహిస్తుండగా, నంగ్లోయ్ ప్రాంతంలో కారులో ధర్మేందర్(39), రజనీష్(25) మద్యం సేవించడాన్ని గమనించాడు. నిందితులిద్దర్ని మందలించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులు సందీప్ మాలిక్ బైక్ని ఢీకొట్టి 10 మీటర్ల వరకు లాక్కెళ్లారు. దీంతో సందీప్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతర పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
Read Also: 2024లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్లు ఎవరంటే..? (అన్ని ఫార్మాట్లలో)
ఇద్దరు వ్యక్తులు ధర్మేందర్, రజనీష్లను ప్రధాన నిందిలుగా చేర్చారు. మరో ఇద్దరు జితేందర్ అలియాస్ జీతు, మనోజ్ షరేమాన్లు ధర్మేందుర్కి ఆశ్రయం కల్పించినందుకు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ధర్మేందర్, రజనీష్లను అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్కి న్యాయం జరిగేలా ఛార్జిషీట్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నాగ్లోయ్లోని వీణా ఎన్క్లేవ్లో అదే ప్రాంతంలో నివసిస్తున్నందున నిందితులు సందీప్ మాలిక్కి తెలుసని దర్యాప్తులో తేలింది. హర్యానాలోని రోహ్తక్కి చెందిన సందీప్ మాలిక్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మేందర్ తన స్నేహితుడు అమిత్ నుంచి కారుని తీసుకున్నాడని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!