Delhi: పబ్లిక్ ప్లేస్లో మందు తాగొద్దని చెప్పినందుకు కానిస్టేబుల్ హత్య..
- పబ్లిక్ ప్లేస్లో మందు తాగొద్దని చెప్పినందుకు దారుణం..
- పోలీస్ కానిస్టేబుల్ని చంపేసిన నిందితులు..
- ఢిల్లీలో ఘటన, ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: పబ్లిక్ ప్లేస్లో మద్యం సేవించొద్దని మందలించినందుకు ఓ కానిస్టేబుల్ని ఇద్దరు చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 29న ఢిల్లీలో జరిగింది. ఔటర్ ఢిల్లీలో రోడ్డుపై మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను మందలించిన 30 ఏళ్ల కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై 400 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఛార్జిషీట్ ప్రకారం.. సందీప్ మాలిక్ సెప్టెంబర్ 29న సివిల్ దుస్తుల్లో నైట్ డ్యూటీ నిర్వహిస్తుండగా, నంగ్లోయ్ ప్రాంతంలో కారులో ధర్మేందర్(39), రజనీష్(25) మద్యం సేవించడాన్ని గమనించాడు. నిందితులిద్దర్ని మందలించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులు సందీప్ మాలిక్ బైక్ని ఢీకొట్టి 10 మీటర్ల వరకు లాక్కెళ్లారు. దీంతో సందీప్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతర పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Also Read
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
Read Also: 2024లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్లు ఎవరంటే..? (అన్ని ఫార్మాట్లలో)
ఇద్దరు వ్యక్తులు ధర్మేందర్, రజనీష్లను ప్రధాన నిందిలుగా చేర్చారు. మరో ఇద్దరు జితేందర్ అలియాస్ జీతు, మనోజ్ షరేమాన్లు ధర్మేందుర్కి ఆశ్రయం కల్పించినందుకు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ధర్మేందర్, రజనీష్లను అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్కి న్యాయం జరిగేలా ఛార్జిషీట్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నాగ్లోయ్లోని వీణా ఎన్క్లేవ్లో అదే ప్రాంతంలో నివసిస్తున్నందున నిందితులు సందీప్ మాలిక్కి తెలుసని దర్యాప్తులో తేలింది. హర్యానాలోని రోహ్తక్కి చెందిన సందీప్ మాలిక్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మేందర్ తన స్నేహితుడు అమిత్ నుంచి కారుని తీసుకున్నాడని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!