Delhi: పబ్లిక్ ప్లేస్లో మందు తాగొద్దని చెప్పినందుకు కానిస్టేబుల్ హత్య..
- పబ్లిక్ ప్లేస్లో మందు తాగొద్దని చెప్పినందుకు దారుణం..
- పోలీస్ కానిస్టేబుల్ని చంపేసిన నిందితులు..
- ఢిల్లీలో ఘటన, ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: పబ్లిక్ ప్లేస్లో మద్యం సేవించొద్దని మందలించినందుకు ఓ కానిస్టేబుల్ని ఇద్దరు చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 29న ఢిల్లీలో జరిగింది. ఔటర్ ఢిల్లీలో రోడ్డుపై మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను మందలించిన 30 ఏళ్ల కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై 400 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఛార్జిషీట్ ప్రకారం.. సందీప్ మాలిక్ సెప్టెంబర్ 29న సివిల్ దుస్తుల్లో నైట్ డ్యూటీ నిర్వహిస్తుండగా, నంగ్లోయ్ ప్రాంతంలో కారులో ధర్మేందర్(39), రజనీష్(25) మద్యం సేవించడాన్ని గమనించాడు. నిందితులిద్దర్ని మందలించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులు సందీప్ మాలిక్ బైక్ని ఢీకొట్టి 10 మీటర్ల వరకు లాక్కెళ్లారు. దీంతో సందీప్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతర పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Also Read
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Haryana : జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
- Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Read Also: 2024లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్లు ఎవరంటే..? (అన్ని ఫార్మాట్లలో)
ఇద్దరు వ్యక్తులు ధర్మేందర్, రజనీష్లను ప్రధాన నిందిలుగా చేర్చారు. మరో ఇద్దరు జితేందర్ అలియాస్ జీతు, మనోజ్ షరేమాన్లు ధర్మేందుర్కి ఆశ్రయం కల్పించినందుకు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ధర్మేందర్, రజనీష్లను అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్కి న్యాయం జరిగేలా ఛార్జిషీట్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నాగ్లోయ్లోని వీణా ఎన్క్లేవ్లో అదే ప్రాంతంలో నివసిస్తున్నందున నిందితులు సందీప్ మాలిక్కి తెలుసని దర్యాప్తులో తేలింది. హర్యానాలోని రోహ్తక్కి చెందిన సందీప్ మాలిక్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మేందర్ తన స్నేహితుడు అమిత్ నుంచి కారుని తీసుకున్నాడని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!