Fraud Case: ప్రధాని మోడీ కార్యదర్శికి కూతురు, అల్లుడు అంటూ.. కోట్లు వసూలు చేసిన జంట
- ప్రధాని నరేంద్ర మోదీ కార్యదర్శి పీకే మిశ్రా పేరు వాడుతూ..
- కోట్లు సంపాదించేందుకు ప్రయత్నించిన ఓ జంట అరెస్టు..
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud Case: ప్రధాని నరేంద్ర మోదీ కార్యదర్శి పీకే మిశ్రా పేరు వాడుతూ అడ్డదారిలో కోట్లు సంపాదించేందుకు ప్రయత్నించిన ఓ జంట అరెస్టు అయింది. ఒడిశా పోలీసులు హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి అనే దంపతులను అరెస్టు చేసారు పోలీసు అధికారులు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఇన్ఫోసిటీ ప్రాంతంలో విలాసవంతమైన కార్యాలయం నిర్వహిస్తూ.. హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి జంట ప్రధాన మంత్రి కార్యదర్శి పీకే మిశ్రా కుటుంబ సభ్యులుగా పరిచయం చేసుకునేవారు. ముఖ్యంగా మైనింగ్, నిర్మాణ రంగాల్లో ఉన్న ధనవంతులను టార్గెట్ చేస్తూ, ప్రభుత్వ టెండర్లు ఇప్పిస్తామని నమ్మించేవారు. అందుకు సంబంధించిన ఫోటోలు, ఫేక్ సంబంధాలను చూపించి బాధితుల నుంచి భారీగా డబ్బు గుంజేవారు.
Also Read: HYDRAA: ఖాజాగూడ చెరువులో కూల్చివేతలు.. తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు!
Also Read
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
అయితే, ఈ జంట చేతిలో మోసపోయిన ఓ గనుల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అనంతరం భువనేశ్వర్ పోలీసులు హన్సితా, అనిల్ జంటపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అభిలిప్సా, అనిల్ మహంతి పలువురి వద్ద కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆధారాలు లభించాయి. ఇక ఈ విషయంపై అడిషనల్ డీసీపీ స్వరాజ్ మాట్లాడుతూ.. ఈ జంట పీకే మిశ్రా సమీప బంధువులుగా పలువురిని మోసం చేశారని, బాధితులు ముందుకొచ్చి తమ ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు. డిసెంబర్ 26న కేసు నమోదు చేయగా, బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నాం అని వెల్లడించారు. ఇక ఈ జంట చేతిలో మోసపోయిన వారు పోలీసులను సంప్రదించి తమ ఫిర్యాదులను నేరుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల సహకారంతో పూర్తి వివరాలను సేకరించి, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రజలు ఇటువంటి మోసాలను గుర్తించి, మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
-
Vivo Y6a: మార్కెట్ లోకి వివో Y6a.. 7200 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
-
BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!