Mother Sold Son : కొడుకును అమ్మేసి.. కిడ్నాప్ చేశారంటూ డ్రామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి అనే పదానికి మచ్చ తీసుకువచ్చిందో మహిళ.. కన్న కొడుకు డబ్బుల కోసం అమ్మేసి.. పైగా కిడ్నాప్ చేశారంటూ డ్రామాకు తేరలేపింది. ఈ నెల2 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లాలో కంది గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంది గ్రామానికి చెందిన వడ్డె శ్రీలత (32) తన భర్తకు దూరంగా తన మూడేళ్ల కొడుకుతో కలిసి ఉంటోంది. అయితే.. శ్రీలత ఈ నెల 1వ తేదీన తన మూడేళ్ల కొడుకును రోడ్డుపై కొడుతూ కనిపించింది. అయితే.. అదే సమయంలో అటుగా వెళ్తున్న అదే సమయంలో అటుగా వెళ్తున్న చెందిన హసన్ అనే మెకానిక్.. బాలుడిని ఎందుకు కొడుతున్నావంటూ ప్రశ్నించగా, నా కొడుకు..నా ఇష్టం అంటూ సమాధానం ఇచ్చింది శ్రీలత. దీనికి.. నీకు ఇష్టం లేకుంటే ఎవరికైనా ఇచ్చేయ్.. అందుకు డబ్బులు ఇస్తారంటూ మెకానిక్ హసన్ వెల్లడించడంతో.. కొడుకును విక్రయించ డానికి సిద్ధమైంది శ్రీలత.
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 2న జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హైదరాబాద్ కు చెందిన మెకానిక్ హసన్ అతడి భార్య సనాబేగంలకు కొడుకును 30వేలకు శ్రీలత విక్రయించింది. ఈ వ్యవహారాన్నంతా మెకానిక్ హసన్ తన సెల్ఫోన్ వీడియో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన ఓ మెకానిక్ తనను కత్తితో బెదిరించి తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ సంగారెడ్డి రూరల్ పోలీసులకు శ్రీలత ఫిర్యాదు చేసింది. దీంతో.. రంగంలోకి దిగిన సంగారెడ్డి రూరల్ పోలీసులు.. బృందాలతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్లోని ఎల్బీనగర్ లో బాలుడు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వెంటనే మెకానిక్ దంపతులతో పాటు బాలుడిని శనివారం సంగారెడ్డికి తీసుకువచ్చారు. వడ్డె శ్రీలతను బెదిరించడం, బాలుడిని కిడ్నాప్ చేయడం అవాస్తవమని పోలీసుల నిర్దారణ వచ్చారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు శ్రీలతపై, బాలుడిని కొనుగోలు చేసినందుకు మెకానిక్ దంపతులు హసన్-సనాబేగంలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని సంగారెడ్డిలోని శిశుగృహకి తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
-
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!