Crime News: ప్రియుడి మోజులో భార్య కుట్ర.. చివరికి ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమ సంబంధాల మోజులో కొందరు మహిళలు తమ సంసారాల్ని పాడు చేసుకుంటున్నారు. కుటుంబ పరువుల్ని బజారుకీడుస్తున్నారు. చివరికి భర్తల్ని కడతెర్చేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఓ మహిళ కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టింది. ప్రియుడి మోజులో భర్తకు విషమిచ్చి హతమార్చింది. చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయి, కటకటాలపాలయ్యింది. మైసూరులో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే..
మైసూరు జిల్లాకు చెందిన లోకమణి(36)కి పదేళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే.. శిల్పకు పెళ్లి కాకముందు నుంచే తన ఇంటిపక్కన ఉండే అభినందన్తో అఫైర్ ఉండేది. అప్పుడే వీళ్లు తమ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కానీ, వీరి వివాహానికి శిల్ప కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పరిస్థితులు చెయ్యి దాకటముందే లోకమణికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తర్వాత కూడా శిల్ప తన ప్రియుడితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. ఎవ్వరికీ తెలియకుండా పదేళ్ల పాటు తమ అఫైర్ నడిపించారు. కానీ.. ఎన్నాళ్లిగా గుట్టుగా సాగించాలనుకున్న ఆ ఇద్దరు, లోకమణిని అడ్డు తొలగించాలని నిర్ణయించారు.
Also Read
ప్లాన్ ప్రకారం.. ఓ రోజు శిల్ప తన భర్త లోకమణి భోజనంలో విషం కలిపింది. గంట తర్వాత అతడు మృతి చెందాడు. గుండెపోటు వచ్చి తన భర్త మరణించాడని అందరినీ నమ్మించింది. అయితే.. కొన్ని రోజుల్లోనే శిల్పలో మార్పు రావడాన్ని మృతుడి తల్లి గమనించింది. దీంతో.. కోడలే తన కొడుకుని చంపిందన్న అనుమానం బలపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. శిల్ప, ఆమె ప్రియుడు అభినందన్ తమ నేరాన్ని ఒప్పుకున్నారు. తమ అఫైర్ కోసం తామే లోకమణిని చంపామని అంగీకరించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!