నిత్యం రద్దీగా వుండే విజయవాడలో ఓకారులో లభించిన డెడ్ బాడీ అందరినీ పరుగులు పెట్టించింది. చాలా రోజుల నుంచి అక్కడో కారు పార్క్ చేసి ఉన్నా నిత్యం అక్కడ గస్తీ తిరిగే పోలీసులు పట్టించుకోలేదు. ఆ ప్రాంతంలో కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఆ కారును పరిశీలించారు. కారులో డెడ్ బాడీ వుండడంతో అసలేం జరిగిందో అర్థంకాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లా పటమటలంకలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.…
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఐతవరంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో రామచంద్రబాబు అనే వ్యక్తిపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంకు చెందిన రామచంద్రారెడ్డి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడు తెనాలి మండలం ఐతవరంకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో సదరు మహిళ కుమార్తె రామచంద్రారెడ్డి మర్మాంగాలు కోసేసింది. సోమవారం రాత్రి మద్యం తాగి…
తిరుమలలో సంచలనం కలిగించిన బాలుడి కిడ్నాప్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కిడ్నాప్ కి గురైన బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీసీటీవీ పుటేజి ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న ఉదయం రైల్వే స్టేషన్ కి బాలుడితో సహ కిడ్నాపర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్లో ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి. కిడ్నాపర్ తెలుగు భాష మాట్లాడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తిరుపతి నుంచి ట్రైన్ ద్వారా నెల్లూరు లేదా కడపకు…
ఏపీలో మహిళలపట్ల దారుణాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళల్ని, బాలికల్ని టార్గెట్ చేస్తున్నారు కొందరు మృగాళ్ళు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి అత్యాచార ఘటన మరువక ముందే మరో బాలికపై అత్యాచార ప్రయత్నం జరిగింది. నూజివీడుకు చెందిన మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి తీసుకుని వెళ్తా అని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఆటో డ్రైవర్. 5వేలు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వు లేదంటే నైట్ మొత్తం నాతో గడువు అంటూ…
దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ కాటేదాన్ లో దొంగలు పేట్రేగిపోతున్నారు. మొన్న దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. అది మరచిపోకముందే ఏటీఎం లో చోరీకి విఫలయత్నం చేశారు. అలారం మ్రోగడం తో పరారయ్యారు దుండగులు.కాటేదాన్ శ్రీ రామ్ నగర్ కాలనీకి సమీపంలో ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎం లోకి చొరబడ్డారు కొంతమంది దుండగులు. తమతో తెచ్చుకున్న రాడ్ తో ఏటీఎం డోర్ ధ్వంసం చేశారు దుండగులు. డోర్ తెరచుకోవడంతో వెంటనే అలారం మోగింది. దీంతో వెంటనే అలర్ట్…
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కారణంగా జి.కొత్తపల్లిలో పోలీసుల రెండు వారాల పాటు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో 8 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులు మోహరించారు. ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బజారయ్య ద్వారకాతిరుమల పోలీసుల…
కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం దారుణహత్య చోటుచేసుకుంది. సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడి హత్య కలకలం రేపింది. తలాటం శివ అనే యువకుడిని మణి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టినరోజు సందర్భంగా శివ అనే వ్యక్తి సామర్లకోటలోని స్థానిక విఘ్నేశ్వర థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చాడు. అయితే అతడిని థియేటర్ వద్దే మణి అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో పుట్టినరోజు నాడే శివ చనిపోయాడు. ఈ ఘటనపై…
ఈమధ్యకాలంలో చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు యువత. అదే మద్యం మత్తులో అయితే వారుచేసే హడావిడి అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్లో మద్యం మత్తులో ఒక యువకుడు చేసిన హడావిడి పోలీసులకు చెమటలు పట్టించింది. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు మద్యం మత్తులో ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. నర్సింగ్ రావు గతంలో రెండు పర్యాయాలు టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. శనివారం అర్థరాత్రి 11…
బీజేపీ నేత, పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్తో సహా మరో వ్యక్తిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. అయితే.. ఆశిష్ గౌడ్ రూ. రెండున్నర కోట్ల రుణం తీసుకొని బ్యాంకు వద్ద మార్టిగేజ్ చేసిన ఫ్లాట్లను వేరొకరికి అమ్ముకొని మోసానికి పాల్పడ్డ బీజేపీ నేత కుమారుడిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 వ్యాపార కార్యకలపాల కోసం సోమాజిగూడలోని ఎస్బీఐ శాఖ నుంచి రుణం కోసం…
పవిత్రమయిన ఉపాధ్యాయ వృత్తిలో వుండి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొంతమంది టీచర్లు. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో చిల్లగుండ్ల పల్లెలో సైకో ఉపాధ్యాయుడు ఉదంతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చెబితే చాక్ పీసు తాళి కట్టేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో టిచర్ గా పనిచేస్తున్న అబు (58)విద్యార్ధినుల పట్ల పైశాచికంగా ప్రవర్తించి,లైంగికంగా వేధించేవాడు. చిత్రహింసలు పెట్టాడు అబు. తల్లిదండ్రులు, ఇతరులెవరికైనా ఈ విషయాన్ని చెబితే టీసీ ఇచ్చి…