వరల్డ్ కప్లో ఫైనల్స్కు దూసుకెళ్లింది టీమిండియా. 2019 పరాభవానికి న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అద్భుతంగా రాణించి ఫైనల్ చేరింది టీమిండియా. భారత్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్పై 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Babar Azam: ప్రపంచ కప్ 2023లో పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటోంది. పాక్ మాజీ క్రికెటర్లు ప్లేయర్లను ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే ఊహాగానాల నేపథ్యంలో, బుధవారం అన్ని పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ నుంచి వైదొగులుతున్నట్లు బాబార్ ఆజమ్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకున్నాడు.
2023 ప్రపంచకప్లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన తర్వాత పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జట్టు మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పించారు.
వాంఖడే మైదానంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కింగ్ కోహ్లీ పేరిట ఉంది. 2023 ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్లో విరాట్ బ్యాట్ నుండి ఈ చారిత్రాత్మక సెంచరీ వచ్చింది.
టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగి ఆడడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టారు.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.