లీడ్స్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్లో 100 సిక్సర్లు కొట్టి బౌలింగ్లో100 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఈ సిక్సర్తో టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 81 టెస్టులు ఆడి మొత్తం…
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ లీచ్ బౌలింగ్లో నికోల్స్ షాట్ ఆడగా అది అవతలి ఎండ్లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్కు తగిలి నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో అంపైర్ ఔట్గా ప్రకటించాడు. చేసేందేమీ లేక న్యూజిలాండ్ ఆటగాడు నికోల్స్ నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఈ అవుట్ పట్ల ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ కూడా కాసేపు అయోమయంలోనే ఉండిపోయాడు. హెన్రీ నికోల్స్ ఎలా…
ఇప్పటివరకు రుమేలీ ధర్ ఇండియా తరఫున 78 వన్డేలు ఆడి 961 పరుగులు చేసింది. అటు 18 టీ20లు ఆడి 131 పరుగులు సాధించింది. టెస్ట్ కెరీర్లో నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది. నాలుగు టెస్టుల్లో రుమేలీ ధర్ 236 పరుగులు చేసింది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య స్వదేశంలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ నాలుగు మ్యాచ్లు ముగియగా.. చెరో రెండు విజయాలతో ఇరు జట్లు సిరీస్ని సమం చేశారు. ఇప్పుడు ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇరు జట్లకి ఇది తాడోపేడో మ్యాచ్! ఎవరు గెలుస్తారో, వారికే సిరీస్ దక్కుతుంది. మొదట్లో భారత్ రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో, దక్షిణాఫ్రికా సునాయాసంగా ఈ సిరీస్ని కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. తొలి మ్యాచ్లో భారీ టార్గెట్ని…
టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. అయితే ఇప్పటికి మూడు మ్యాచ్లు టీమిండియా-సౌతాఫ్రికాల మధ్య జరుగగా.. అందులో మొదటి రెండు మ్యాచ్లు సౌతాఫ్రికా కైవవం చేసుకుంది. అయితే మూడో మ్యాచ్ టీమిండియా ఖాతాలో పడగా.. నేడు నాలుగో మ్యాచ్ రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన సఫారీలు బౌలింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియాకు బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు…
ఈరోజు రాజ్కోట్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. విశాఖలో జరిగిన గత మ్యాచ్లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకున్న టీమిండియా ఈ మ్యాచ్లోనూ గెలవాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిస్తే ఐదు టీ20ల సిరీస్ ఆ జట్టు సొంతం అవుతుంది. ఎందుకంటే ఆ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే ఈ సిరీస్లో టీమిండియాను కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ కలవరపెడుతోంది. వరుసగా మూడు మ్యాచ్లలో 29,…
గత ఏడాది కరోనా కేసుల కారణంగా ఇంగ్లండ్లో టీమిండియా ఆడుతున్న టెస్టు సిరీస్ అర్ధంతరంగా ఆగిపోయింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదో టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఐదో టెస్టు ఆడేందుకు టీమిండియా గురువారం నాడు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జూలై 1 నుంచి ఎడ్జ్బాస్టన్లో జరగనుంది. అయితే…
రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో టీ20లో టీమిండియాలో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. యువ పేసర్ అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్ దీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన గత మ్యాచ్లో అవేష్ ఖాన్ గాయపడ్డాడు. అతడి చేతి వేలికి గాయమవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే డగౌట్కు చేరాడు. ఈ క్రమంలోనే అవేష్ ఖాన్ నాలుగో టీ20కి దూరం కానున్నాడు. కాగా ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన అవేష్ ఖాన్ పెద్దగా రాణించిందేమీ లేదు.…
భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నాటి నుంచి టీమిండియాకు ఇప్పటివరకు ఒకే ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఏడాది నుంచి చూస్తే టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, ఆజింక్యా రహానె, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం, పలువురు గాయపడటం వంటి పరిస్థితుల కారణంగా ఏడుగురు కెప్టెన్లు పనిచేయాల్సి వచ్చింది. గత…
రాబోయే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ మీడియా ప్రసార హక్కులను వేలం వేయడం ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరింది. సుమారు రూ.48,390 కోట్లు రావడంపై బీసీసీఐ డబ్బుపై మోజు పడుతోందని.. క్రికెట్ ద్వారా భారీగా డబ్బులు వెనకేసుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బోర్డుకు భారీగా ఆదాయం రావడంపై గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే క్రికెట్ అనేది ఓ మతం అని.. డబ్బుకు…