IND Vs WI: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లోనూ వెస్టిండీస్పై 59 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5…
Heath Davis Sensational Statement: న్యూజిలాండ్ మాజీ స్టార్ క్రికెటర్ హీత్ డేవిస్ (50) సంచలన ప్రకటన చేశాడు. ఇన్నాళ్లు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి రహస్యంగా ఉంచిన ఓ విషయాన్ని రివీల్ చేశాడు. తాను స్వలింగ సంపర్కుడిని (గే) అని హీత్ డేవిస్ వెల్లడించాడు.ఈ విషయం తనతో ఉన్నవాళ్లందరికీ తెలుసని అతడు తెలిపాడు. దీని గురించి బయట ప్రపంచానికి చెప్పడానికి చాలా కాలం పాటు తనలో తానే కుమిలిపోయాయనని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇక…
IND Vs WI: సెయింట్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఎట్టకేలకు ఆ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (11) కూడా విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (10) కూడా…
IND Vs WI: బస్టెర్రె వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. అభిమానులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరింది. మ్యాచ్ జరిగే బస్టెర్రెలోని వార్నర్ పార్క్కు రెండు జట్ల లగేజీ ఆలస్యంగా రావడంతో అనుకున్న సమయానికి…
Dhoni Record Breaks: కామన్వెల్త్ గేమ్స్లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. తొలి మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై ఓటమి ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆదివారం దాయాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్కౌర్ రికార్డు సృష్టించింది. దీంతో…
Common Wealth Games 2022: ఇంగ్లండ్లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ పోటీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహిళల క్రికెట్ పోటీలలో భాగంగా ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుండటంతో అందరి దృష్టి ఈ మ్యాచ్పైనే ఉంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వరుణుడి కారణంగా ఈ మ్యాచ్ను 18 ఓవర్లకు…
Danish Kaneria comments on virat kohli: పేలవ ఫామ్లో ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై పాకిస్థాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. జింబాబ్వేలో జరిగే వన్డే సిరీస్కు కోహ్లీని ఎంపిక చేస్తే అతడు గాడిలో పడే అవకాశాలు ఉండేవని కనేరియా అభిప్రాయపడ్డాడు. కోహ్లీని జింబాబ్వే పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్టర్లను సూటిగా ప్రశ్నించాడు. పరిస్థితులను గమనిస్తుంటే ఆసియా కప్కు కూడా కోహ్లీని…
Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్స్ గేమ్స్లో భాగంగా మహిళ క్రికెట్ పోటీలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాడు భారత్, పాకిస్థాన్ మహిళల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ ఆలస్యమవుతోంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. వరుణుడు శాంతించాక…
Team India For Zimbabwe Tour: ప్రస్తుతం వెస్టిండీస్లో పర్యటిస్తున్న టీమిండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు జింబాబ్వే వెళ్లే భారత జట్టును శనివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లందరికీ ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. ఫామ్తో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని ఈ పర్యటన కోసం ఎంపిక చేస్తారని గతంలో జరిగిన ప్రచారంలో నిజం…
Team India Opening Pair: మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ముంచుకొస్తోంది. అయినా టీమిండియా సెట్ కాలేదు. మిడిలార్డర్, లోయరార్డర్ సంగతి దేవుడెరుగు. ముందు ఓపెనింగ్ జోడీ ఎవరంటే చెప్పలేని దుస్థితి నెలకొంది మన ఇండియా జట్టులో. ఎందుకంటే గత 12 నెలల్లో ఏకంగా 9 మందితో ఓపెనింగ్ జోడీలను టీమిండియా మేనేజ్మెంట్ పరీక్షించింది. కొంతమంది విజయవంతం అయినా వాళ్లను కొనసాగించకుండా కొత్తవాళ్లను పరీక్షిస్తూనే ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోనే ఈ వ్యవహారమంతా…