గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల కోసం ఈ సిరీస్ను ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్కు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు కోలుకుని రెండు రోజుల కిందటే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో టీ20 సిరీస్లో అతడు బరిలోకి దిగడం ఖాయమైంది. రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండటంతో రోహిత్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు.…
ఈనెల 22 నుంచి టీమిండియా వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ మేరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు పాల్గొంటుంది. ఈ పర్యటనకు తాజాగా టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్కు అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పి్ంచారు. త్వరలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లను బీసీసీఐ రొటేటింగ్ చేస్తోంది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, బుమ్రా, భువనేశ్వర్, హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు…
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సమకాలీన ఆటగాళ్లలో కోహ్లీ, స్మిత్, రూట్, విలియమ్సన్ ఫార్మాట్తో సంబంధం లేకుండా అత్యుత్తమ ఆటగాళ్లుగా చలామణి అవుతున్నారు. కానీ వీరిలో విరాట్ కోహ్లీ మాత్రం గత మూడేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. పరుగుల యంత్రం కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నా సెంచరీ చేసి మూడేళ్లు దాటిపోతోంది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆటగాడిగా…
టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారిగా 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఇంగ్లీష్ జట్టు మరో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే కొట్టేసింది. అలాగే తొలి ఇన్నింగ్స్లో 100కు పైగా పరుగుల ఆధిక్యాన్ని పొంది టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో బుమ్రా…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో టీమిండియా చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. ముఖ్యంగా నాలుగో రోజు బౌలింగ్ వైఫల్యం జట్టు కొంప ముంచింది. దీంతో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను టీమిండియా బౌలర్లు ఏ విధంగానూ ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలీ (46) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి నాంది…
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకున్నాడు. ఇటీవల అతడికి చేసిన కరోనా నిర్ధారణ పరీక్షణ నెగిటివ్ రావడంతో రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ కఠోర సాధన చేస్తున్నాడు. భారీ షాట్లతో పాటు డిఫెన్సివ్ షాట్లు ఆడుతూ రోహిత్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దీంతో అతడు త్వరలో ఇంగ్లండ్తో జరిగే వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉండటం…
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రెండు రోజులు టీమిండియానే హవా చూపించింది. దీనికి కారణం ముగ్గురు మోనగాళ్లు. వాళ్లే రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా. పంత్, జడేజా సెంచరీలతో చెలరేగితే.. వరుణుడు అంతరాయం కలిగించినా బుమ్రా పట్టుదలతో బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను కష్టాల్లో పడేశాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టడంతో జస్ప్రీత్ బుమ్రా మరో ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021-23లో ఇప్పటివరకు అత్యధిక…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియాకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నా మనోళ్లు సత్తా చాటుతున్నారు. తొలిరోజు రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగగా.. రెండో రోజు బుమ్రా ఇంగ్లండ్కు తన దెబ్బ రూచి చూపించాడు. బ్యాటింగ్లో ఒకే ఓవర్లో 35 పరుగులు పిండుకున్న బుమ్రా.. బౌలింగ్లోనూ రాణించాడు. కెప్టెన్గా ఎలాంటి ఒత్తిడిని అతడు ఎదుర్కొన్నట్లు కనిపించలేదు. బుమ్రా విజృంభించడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు…
ఇంగ్లండ్తో జరగనున్న కీలక టెస్టు మ్యాచ్లో శుక్రవారం నుంచి టీమిండియా తలపడనుంది. గత ఏడాది జరగాల్సిన ఈ టెస్టును ఐసీసీ రీ షెడ్యూల్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో అభిమానులు ఆసక్తికర పోరును వీక్షించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ వర్సెస్ జేమ్స్ అండర్సన్ మధ్య జరిగే పోరు అందరిలోనూ ఉత్కంఠకు గురిచేస్తోంది. దశాబ్ద కాలంగా ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు. అండర్సన్ కెరీర్లో చివరి దశకు చేరుకోవడంతో టీమిండియాతో అతడికి ఇదే చివరి టెస్టు…