Asia Cup 2022: ఆరు నిమిషాల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లన్నీ హాంఫట్..!!
Asia Cup 2022: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే చాలు అభిమానుల్లో తెలియని భావోద్వేగం చోటు చేసుకుంటుంది. దీంతో అది ఎలాంటి మ్యాచ్ అయినా చూసేందుకు అభిమానులు ఎగబడతారు. కొన్నేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఆసియాకప్లో ఈనెల 28న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో మైదానంలో యుద్ధం లాంటి వాతావరణాన్ని చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీంతో ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు.
Read Also: Krishnashtami: కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఉట్టి కొట్టడంలో దాగి ఉన్న రహస్యమేంటి?
Also Read
- Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. "ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం".. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
- Shreyas Iyer: "222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది".. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
- Yashasvi Jaiswal: "నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే.." వైభవ్పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
స్వాతంత్ర దినోత్సవం రోజు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలను నిర్వాహకులు చేపట్టగా ఆరు నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సుమారు 75 వేల మంది టికెట్ల కోసం ఒకేసారి లాగిన్ అవ్వడంతో అధికారిక వెబ్సైట్ క్రాష్ అయ్యింది. రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు సైట్లో క్యూ సిస్టంను తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఏడున్నర లక్షల మంది టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. అయితే టిక్కెట్లు తక్కువ ఉండటంతో రాత్రి పూట అమ్మకాలను చేపట్టారు. రాత్రి పూట కూడా డిమాండ్ తగ్గకపోవడంతో నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో టిక్కెట్లు లభించక చాలా మంది నిరాశకు గురయ్యారు. కాగా ప్రతిష్టాత్మక మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకాల విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిబంధనలు పాటించలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగాయని ఆరోపిస్తున్నారు. తెలిసినవారికి టికెట్లు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
-
Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో