IND Vs SA: గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారీ స్కోరు చేయడంతో టీమిండియా బతికిపోయింది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ విజయపు అంచుల వరకు తీసుకువెళ్లాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 16 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే…
IND Vs SA: ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్లో పాల్గొనే భారత జట్టును ఆదివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ నుంచి ప్రధాన ఆటగాళ్లను తప్పించారు. ఈ మేరకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ను కెప్టెన్గా నియమించారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్-ఎతో…
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్లో పరుగులు పోటెత్తాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బలమైన పునాది వేయగా.. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ విధ్వంసం సృష్టించారు. చివర్లో దినేష్ కార్తీక్ కూడా తనదైన చేయి వేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు,…
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ను చూసేందుకు స్టేడియంలోకి విశేష అతిథి ప్రవేశించాడు. ఆ అతిథి ఎవరో అని తెగ ఆలోచించకండి. ఆ అతిథి పాము. లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి పాము రావడంతో అభిమానులు భయంతో వణికిపోయారు. 7వ ఓవర్ పూర్తైన తర్వాత ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఒక్కసారిగా పాము గ్రౌండ్లోకి రావడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. పామును చూసి ఆటగాళ్లు కూడా హడలిపోయారు. అనంతరం గ్రౌండ్…
దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో గెలిచి ఊపు మీదున్న టీమిండియా రెండో టీ20 సమరానికి సిద్ధమైంది. గౌహతి వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 ఆడిన జట్టుతోనే భారత్ ఆడనుంది. దక్షిణాఫ్రికా మాత్రం తుది జట్టులో ఒక మార్పు చేసింది. షాంసీ స్థానంలో లుంగీ ఎంగిడికి స్థానం కల్పించింది. మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0…
భారత బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 50 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు(732) చేసిన ఆటగాడిగా నిలిచాడు.
IND Vs SA 1st T20: తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపు రుచి చూసింది. రోహిత్ డకౌట్ అయినా విరాట్ కోహ్లీ 3 పరుగులకే అవుటై నిరాశపరిచినా కేఎల్ రాహుల్ (51 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగి…
IND Vs SA 1st T20:తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. ఒక దశలో సఫారీల జట్టు 9 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టు 10 ఓవర్లలోపే ఆలౌట్ అవుతుందని అనిపించింది. కానీ లోయర్ ఆర్డర్ పట్టుదలగా ఆడటంతో ఆ జట్టు పూర్తి ఓవర్లను ఆడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్కు దిగిన భారత్.. గ్రీన్ వికెట్ను చక్కగా ఉపయోగించుకుంది. తొలి ఓవర్లోనే దీపక్ చాహర్ వికెట్ల పతనానికి…
Mahendra Singh Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ అతడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా విజయవాడలో క్రికెట్ అభిమానులు ధోనీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ధోనీ విగ్రహం కనిపిస్తోంది. ప్రస్తుతం ధోనీ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్కు విగ్రహం పెట్టడం బహుశా ఇదే తొలిసారని కొందరు నెటిజన్స్…
ICC Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో రాణించిన సూర్యకుమార్ ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు ఆసియా కప్లో విఫలమైన బాబర్ ఆజమ్ ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. సెంచరీ చేసినా తన రెండో స్థానాన్ని కోల్పోయాడు. పాకిస్థాన్ ఆటగాడు రిజ్వాన్…