Ind vs NZ: భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs NZ 1st Odi: భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో మొదటి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బ్లాక్లో టికెట్ల అమ్మకాలపై ప్రకటనలు వెలువడుతున్నాయి. వెస్ట్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్కు చెందిన 20 టికెట్లు ఒక్కోటి రూ.3,000 అని.. కావాలంటే ఫలానా నంబర్లు సంప్రదించాలంటూ కేటుగాళ్లు పోస్టింగ్లు పెట్టారు. 1,500 టికెట్ను రెట్టింపు ధరకు బహిరంగంగా బ్లాక్ మార్కెట్లో కొన్ని ముఠాలు అమ్ముతున్నాయి. బ్లాక్ మార్కెట్ దందాపై రాచకొండ ఎస్వోటీ పోలీసులు నిఘా పెట్టారు.
భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్లో భాగంగా బుధవారం ఉప్పల్లో జరిగే తొలిపోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజుల పాటు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచడంతో పూర్తిగా అమ్ముడుపోయాయి. చాలా కాలం తర్వాత హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుండడంతో టికెట్లు వెంటనే అమ్ముడుపోయాయి. ఈనెల 13న 6,000, 14న 7,000, 15న 7,000, 16న 9,417 టికెట్లను పేటీఎం ద్వారా హెచ్ సీఏ అమ్మకాలు జరిపింది.
Also Read
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- 10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
Bharat Jodo Yatra: రాహుల్ను హగ్ చేసుకునేందుకు పరిగెత్తుకొచ్చిన యువకుడు.. వీడియో వైరల్
ఈ సిరీస్కు ముందు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను తెలుసుకుందాం. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు 6 వన్డేలు ఆడగా, ఈ కాలంలో మూడు మ్యాచ్లు గెలిచింది. భారత్లో ఇప్పటివరకు టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మొత్తం 35 వన్డేలు జరగాయి. ఈ సమయంలో న్యూజిలాండ్ 8 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. కాగా, టీమిండియా 26 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అక్కడ ఒక మ్యాచ్ రద్దయింది. అందుకు తగ్గట్టుగానే సొంతగడ్డపై భారత్పై అతడిదే పైచేయిగా నిలిచింది. న్యూజిలాండ్ జట్టు చివరిసారిగా 2017లో భారత్లో వన్డే సిరీస్ ఆడింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-2తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
పాకిస్థాన్ పర్యటన నుంచి శనివారమే నేరుగా హైదరాబాద్ వచ్చిన కివీస్ జట్టు.. లంకతో వన్డే సిరీస్ తర్వాత నగరానికి చేరుకున్న టీమిండియా పూర్తి స్థాయిలో సాధన చేస్తున్నాయి. ఈ సారి సొంత గడ్డపై హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తొలిసారిగా ఆడనున్నాడు. గతంలో ఐపీఎల్లో ఆడినా అంతర్జాతీయ మ్యాచ్లో హైదరాబాద్లో ఆడే అవకాశం రాలేదు.
తాజావార్తలు
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?