ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో రోజు లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 221/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మరో నాలుగు పరుగులు జోడించిన వెంటనే టీమిండియా సాహా (27) వికెట్ను కోల్పోయింది. ఈ వికెట్ కూడా అజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లింది. అయితే వెంటనే అదే ఓవర్లో భారత్కు మరో షాక్ తగిలింది. ఆల్రౌండర్…
ముంబై వేదికగా నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయం దాకా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. ఈ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఓడిపోయే టెస్టును అద్భుతంగా పోరాడి డ్రా చేసుకోవడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టీమిండియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో బరిలోకి దిగనున్నాడు. వ్యక్తిగత కారణాల…
ఐపీఎల్-2022 కోసం రిటైనింగ్ ప్రక్రియ ముగిసింది. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ను వారి జట్లు రిటైన్ చేసుకోలేదు. అయితే వారిని రిటైన్ చేసుకోకపోవడానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్లో అహ్మదాబాద్, లక్నో జట్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ ఇద్దరు ఆటగాళ్లను సంప్రదించడం వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. Read Also: IPL 2022 : ఎక్కువ ధర పలికన ఆటగాళ్లు వీళ్లే ! సన్రైజర్స్ స్టార్…
ఈనెల 3 నుంచి ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఉత్కంఠ రేపిన తొలి టెస్టు చివరకు డ్రాగా ముగియడంతో రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేస్తుండటంతో అతడు ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టెస్టు జట్టులోకి కొత్తగా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడటంతో అతడిపై వేటు వేసే అవకాశం లేదు. దీంతో సీనియర్…
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో భారత్ను పాకిస్థాన్ అధిగమించింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు చేరడంతో ఆ జట్టు మొత్తం పాయింట్ల సంఖ్య 24కి చేరింది. బంగ్లాదేశ్పై టెస్టు గెలిచిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి…
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆకట్టుకున్న దేశవాళీ క్రికెటర్లలో రాహుల్ తెవాటియా ఒకడు. 1993లో మే 20న హర్యానాలో జన్మించిన రాహుల్ తెవాటియా క్రికెట్లో బౌలింగ్ ఆల్రౌండర్గా ఎదిగాడు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్లో పంజాబ్పై రాహుల్ తెవాటియా ఆడిన ఇన్నింగ్స్ను క్రీడాభిమానులు ఎవరూ మరిచిపోలేరు. రాజస్థాన్ ఓడిపోతుందని అందరూ భావించిన తరుణంలో అనూహ్యంగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి గెలిపించిన ఆటగాడు రాహుల్ తెవాటియా. Read Also: ఫుట్బాల్ స్టార్…
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కాన్పూర్ టెస్టు కోసం స్పోర్టింగ్ పిచ్ తయారుచేసిన పిచ్ క్యూరేటర్ శివకుమార్ బృందానికి రూ.35వేలు బహుమతిగా ఇచ్చాడు. ఓ జట్టుకు అనుకూలంగా లేకుండా మంచి పిచ్ తయారుచేసినందుకు పిచ్ క్యూరేటర్, గ్రౌండ్మెన్కు రాహుల్ ద్రవిడ్ అభినందనలు తెలిపాడు. స్పోర్టింగ్ పిచ్ వల్లే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఆసక్తికరంగా సాగింది. చివరిరోజు నాటకీయ పరిణామాల మధ్య టెస్టు డ్రాగా ముగిసినా…
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు న్యూజిలాండ్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ టెస్టులో న్యూజిలాండ్ ముందు 284 పరుగుల టార్గెట్ను భారత్ విధించింది. లక్ష్యఛేదనలో నాలుగోరోజే ఓ వికెట్ కోల్పోయిన కివీస్ను ఐదోరోజు భారత బౌలర్లు సులభంగానే చుట్టేస్తారని అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పోరాట పటిమను చూపుతూ లక్ష్యం వైపుకు దూసుకువెళ్తున్నారు. Read Also: టికెట్ రేట్లపై నాని కౌంటర్ ఐదో రోజు తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా…
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ను 234/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 284 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. తీవ్ర ఒత్తిడి నెలకొన్న దశలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ (65), అశ్విన్ (32), పుజారా (22), అక్షర్ పటేల్ (28 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, జేమీసన్ చెరో మూడు వికెట్లు…
కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా శ్రేయాస్ నిలిచాడు. కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్తో తొలి టెస్టు ఆడుతున్న అతడు తొలి ఇన్నింగ్సులో సెంచరీ సాధించగా.. రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేశారు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అతడు 170 పరుగులు చేశాడు. Read Also: కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. ఐసీసీ టోర్నీ రద్దు అరంగేట్ర…