ప్రస్తుతం భారత క్రికెట్కు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్. అంతేకాకుండా కెప్టెన్గానూ మంచి రికార్డే ఉంది. ఇటీవల టీ20ల తరహాలోనే వన్డేలకు కూడా విరాట్ కోహ్లీ తనంతట తానుగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరూ భావించారు. అయితే విరాట్కు కనీసం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించిందనే వార్త బయటకు రావడంతో కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్పు…
అంతర్జాతీయ వన్డేలకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ నియమించడంతో కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్లు గెలిచిందని పలువురు అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ…
విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 మ్యాచ్ల నుంచి కెప్టెన్గా తప్పుకున్నాడు. తాజాగా వన్డే మ్యాచ్ల కెప్టెన్సీ నుంచి కూడా దూరమయ్యాడు. బుధవారం నాడు బీసీసీఐ టీమిండియా వన్డే కెప్టెన్సీని కోహ్లీ నుంచి రోహిత్కు బదలాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ నిర్ణయం వెనుక ఓ 48 గంటల స్టోరీ దాగి ఉన్నట్లు పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది. నిజానికి 2023 వరకు విరాట్ కోహ్లీ వన్డేలకు కెప్టెన్గా ఉండాలని భావించాడు. Read Also: టెస్ట్…
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్లంటే ఎంత ఆసక్తి ఉంటుందో… ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈనెల 8 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.5:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దగ్గుతో…
టీమిండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించడంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో 50 విజయాలు సాధించిన మొదటి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అంతేకాకుండా ప్రతి ఫార్మాట్లో కనీసం 50 విజయాలు సాధించిన తొలి క్రికెటర్గానూ రికార్డు అందుకున్నాడు. విరాట్ సాధించిన ఈ అరుదైన రికార్డుపై బీసీసీఐ అభినందనలు తెలిపింది. కాగా టెస్టుల్లో కెప్టెన్గా విరాట్ కోహ్లీ 66 మ్యాచ్లకు సారథ్యం వహించగా జట్టుకు 39…
తమ దేశంలో టీమిండియా పర్యటనకు సంబంధించి దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యటన షెడ్యూల్ను దక్షిణాఫ్రికా బోర్డు సవరించింది. దీంతో సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. Read Also: పెళ్లి మండపంలోకి దూరి పెళ్లికూతురి…
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) టాప్-5లో ఉన్నాయి. Read Also: రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం మరోవైపు…
టీమిండియాకు సంబంధించి టెస్టుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే తుదిజట్టులో స్థానం పోగొట్టుకున్న రహానె.. త్వరలో వైస్ కెప్టెన్ పదవిని కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రహానె వరుస వైఫల్యాలే అతడి కెరీర్ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న అతడు.. రెండేళ్లుగా పేలవ ఫామ్ను కనపరుస్తున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై మెల్బోర్న్లో జరిగిన టెస్టులో సెంచరీ మినహా అతడు చెప్పుకోదగ్గ విధంగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టు…
ముంబై టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఓ టెస్టు ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్గా అజాజ్ పటేల్ చరిత్రకెక్కాడు. గతంలో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై 10కి 10 వికెట్లు సాధించగా.. 1999లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్థాన్పై ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ మళ్లీ ఆ ఘనత సాధించి మూడో…
సౌతాఫ్రికాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్ను వాయిదా వేస్తున్నామని… ఆ మ్యాచ్ల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు. Read Also: ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ…