Home
Covid 19
Covid 19 News
-
కరోనాతో భారత క్రికెటర్ సోదరి మృతి…
భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అయిన వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా వేద సోదరి వత్సల శివకుమార్ మృతి చెందారు. గత నెల వేద సోదరికి కరోనా సోకగా.. ఈరోజు ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద కృష్ణమూర్తి మాజీ కోచ్ ఇర్ఫాన్ సైత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెలిపారు. రెండు వారాల క్రితమే వేద తల్లి కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక వేద కృష్ణమూర్తి భారత… -
సహాయం కోరుతూ సోనూసూద్ ఇంటికి చేరిన జనం….!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంతకుముందు కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు చేసిన సాయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయన కష్టం అన్నవారికి కాదనకుండా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఎక్కడ కష్టం అనే మాట వినిపించిన అక్కడ వాలిపోతున్నారు. ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలోనూ సోనూసూద్ వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సోనూసూద్ చేస్తున్న సాయం ఆయనను పేదల పాలిట దేవుడిని చేస్తోంది.… -
ఆలస్యం కానున్న ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్…!
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు సినిమా ఇండస్ట్రీపై కూడా బాగా పడుతోంది. కరోనా వల్ల స్టార్స్ అంతా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు ఆలస్యం కాబోతున్నాయి. ఎన్టీఆర్ భవిష్యత్ ప్రణాళికలకు కరోనా బ్రేక్ వేసేసింది. కరోనా కారణంగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న బుల్లితెర షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి… -
కరోనా నుంచి కోలుకున్న పూజా హెగ్డే
బుట్టబొమ్మ పూజా హెగ్డే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ కరోనా నుంచి కోలుకుంది. ఈ విషయాన్ని పూజ స్వయంగా తన ఇన్స్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. “మీ ప్రేమకు ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. చివరకు నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. మీ విషెస్ మరియు హీలింగ్ ఎనర్జీ అంతా ఇంద్రజాలం చేసినట్లు అనిపించింది. సురక్షితంగా ఉండండి” అంటూ నవ్వుతూ ఉన్న సెల్ఫీని పోస్ట్ చేసింది పూజా. ఏప్రిల్ 26న కరోనా సోకినట్లు ప్రకటించింది… -
అభిమాని మరణంతో కలత చెందిన జగపతిబాబు!
రెండు దశాబ్దాలకు పైగా జగపతి బాబు అభిమానిగా ఉన్న శ్రీను ఈ రోజు ఉదయం కరోనాతో గుంటూరులో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి జగపతిబాబు తన సంతాపాన్ని తెలియచేశారు. గుంటూరులోని తన అభిమాన సంఘం ప్రెసిడెంట్ గానూ ఉన్న శ్రీను మరణం జీర్ణించుకోలేనిదని అన్నారు. విశేషం ఏమంటే… జగపతిబాబును ఎంతగానో అభిమానించే శ్రీను తన కుమారుడొకరికి జగపతి పేరునే పెట్టారు. శ్రీను కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపిన జగపతిబాబు, కరోనా కారణంగా కళ్ళ ముందు ఎంతో మంది… -
దీపికా పదుకొనెకు కరోనా పాజిటివ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కరోనా బారిన పడిన సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. తాజాగా దీపికాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం దీపికా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ నుండి కోలుకోవడానికి ఆమె డాక్టర్లు సూచించిన మందులు తీసుకుంటోంది. దీపికా ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే దీపికా తల్లిదండ్రులు, చెల్లెలికి కరోనా సోకింది. దీపికా తండ్రి ప్రస్తుతం బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో… -
ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ రాద్దు కావడానికి అతనే కారణమా..?
కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో ఈరోజు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అయితే బయో బబుల్లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం పై చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కేకేఆర్ ఆటగాడు వరుణ్ చక్రవర్తీ బయో బబుల్ ధాటినట్లు తెలుస్తుంది. భుజ గాయానికి స్కానింగ్ తీసేందుకు వరుణ్ బబుల్ వీడి ఆసుపత్రికి వెళ్లినట్లు… అక్కడే అతనికి వైరస్ సోకినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే… -
కనిపించని నాలుగో సింహమే మనోధైర్యం: సాయికుమార్
ప్రముఖ నటుడు సాయికుమార్ తన చుట్టూ ఉన్న వారికి ఏ ఆపద వచ్చినా తనవంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. కరోనా కష్ట కాలంలోనూ తన వంతు సాయం చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సాయికుమార్ సోషల్ మీడియా ద్వారా ఓ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, అది వేసుకుంటే ప్రాణాలకు ఢోకా ఉండదని హితవు పలికారు. ‘పోలీస్ స్టోరీ’లోని పాపులర్ డైలాగ్ ను ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ… -
ఆక్సిజన్ దాతలకు బైక్ ఆఫర్ చేస్తున్న హర్షవర్థన్ రాణే!
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత అందరినీ అల్లాడిస్తోంది. హాస్పిటల్స్ లో తగినంతగా ఆక్సిజన్ నిల్వలు లేకపోవడంతో కొవిడ్ పేషంట్స్ కన్నుమూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఫిల్మ్ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందిస్తున్నారు. మరికొందరు కరోనాకు సంబంధించిన బాధితుల సమాచారాన్ని వీలైనంత మందికి తెలియచేయడానికి సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకుంటున్నారు. అయితే ప్రముఖ నటుడు హర్షవర్థన్ రాణే మరో అడుగు ముందుకేశాడు. కరోనా బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఆదుకొనేంత స్థోమత తనకు… -
కోవిడ్ నుంచి కోలుకుంటున్నా… : అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు అల్లుఅర్జున్. “అందరికీ హలో! చాలా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను బాగా కోలుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇంకా సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు, నా కోసం చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇచ్చిన అప్డేట్…
తాజావార్తలు
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!