కరోనా వైరస్ చాలా మంది జీవితాల్ని అతలాకుతలం చేస్తోంది. లాక్డౌన్ కారణంగా పనులు లేక, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఎందరో సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి షకీలా పేదవారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షకీలా చేస్తున్న సేవ పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు. కష్టకాలంలో ఉన్న వారికి మీకు తోచినంత సాయం…
కరోనా బాధితుల కోసం మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆయుష్షు 64 మెడిసిన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. గతంలో మలేరియా కోసం వాడిని ఈ డ్రగ్ ను కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరుపనుంది. 18 నుండి 60 మధ్య సంవత్సరాల వయస్సు వారిపైన క్లినికల్ ట్రయల్స్ చేయనుంది నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూనినాని. ఆసింటమేటిక్, మైల్డ్ సింటమ్స్ ఉన్న కరోనా బాధితులను అధికారులు…
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించలేదన్న కోర్టు.. కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వలేదని మండిపడింది.. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి నివేదికలో సరైన సమాధానంలేదని వ్యాఖ్యానించింది.. ఇక, రేపు జరిగే విచారణకు.. హెల్త్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ.. అందరూ హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.. మహారాష్ట్రలో 8 వేల…
తెలంగాణ హైకోర్టులో కరోనా స్థతి గతులపై విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 29న లక్ష పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన 10 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్స లైసెస్సులు రద్దు చేసినట్టుకు ప్రభుత్వం తెలిపింది. 79 ఆసుపత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం…
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్ చేరుకుంది. రష్యా నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గో లో దిగుమతి అయింది. వ్యాక్సిన్ రష్యా నుండి ప్రత్యేక ఛార్టర్డ్ ఫైట్ ( RU-9459) లో హైదరాబాద్…
ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తయారీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి మందు తయారీ జరుగనున్నది. దీంతో ఈ రోజు కలెక్టర్తో ఆనందయ్య సమావేశం అయ్యారు. మందు పంపిణీపై చర్చించారు. కృష్ణపట్నం ఎవరూ రవొద్దని, ఆన్లైన్ లో మందు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్లైన్ లో మందు పంపిణీకి మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పంపిణీకి మరో 5 రోజుల సమయం పడుతుందని అందరికీ తప్పకుండా మందు పంపిణీ…
కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అనేక దేవాలయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తిరుమల ఆలయానికి భక్తుల రద్ధీ తగ్గిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీవారీ దర్శనాలు, ఆదాయంపై కరోనా ఎఫెక్ట పడింది. మే నెలలో భక్తున సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మే నెలలో మొత్తం 2,13,749 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.11.95 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మే నెలలో 91,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కరోనా ప్రభావం,…
కరోనా కేసులు ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనాకు కారణమైన సార్స్ కోవ్ 2 వైరస్ అనేక మ్యూటెంట్లుగా మార్పులు చెంది ప్రజల ప్రాణాలు హరింస్తోంది. కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, సార్స్ కోవ్ 2 వైరస్లో ఉత్పరివర్తనాలు వేగంగా మార్పులు జరుగుతుండటంతో అన్నిరకాల వేరియంట్లను తట్టుకొని నిలబడటం కోసం మెడిసిన్ను రెడీ చేస్తున్నట్టు అమెరికాలోని పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు పేర్కోన్నారు. కరోనాను కట్టడి చేయడానికి యాంటివైరల్ను అభివృద్ది చేయడం అత్యవసరంగా…
కరోనా కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ మరింతగా పెరిగింది. కర్ఫ్యూ లాక్ డౌన్ వంటివి అమలు జరుగుతుండటంతో కొంత సమయం మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతులు ఉండటంతో ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకుంటున్నారు. ఉదయాన్నే లేవడం వలన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా త్వరగా లేచే వారికి గుండె జబ్బులు, ఊబకాయం వంటివి దరిచేరే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆలస్యంగా పడుకొని, ఆలస్యంగా నిద్రలేచే వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.…