తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా కిందికి దిగుతున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 917 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 10 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1,006 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510కు చేరగా.. రికవరీ కేసులు 6,06,461కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
రేపటి నుంచి ఏపీలో ఆంక్షలను సడలించబోతున్నారు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సడలలింపు సమయాన్ని పెంచుతూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటివిటీ 5 శాతం కంటే తక్కువగా ఉన్న 8 జిల్లాల్లో సడలింపుల సమయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచారు. పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. జులై 1 నుంచి 7 వరకు సడలించిన…
కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు భారత్ బయోటెక్ ఫార్మాసంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తయారు చేసింది. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్కు ఇప్పటికే భారత్లో అనుమతులు లభించాయి. వేగంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, యూరోపియన్ దేశాలు కోవాగ్జిన్ను వ్యాక్సిన్గా గుర్తించకపోవడంతో అక్కడి దేశాలకు వ్యాక్సిన్ను ఎగుమతి చేయలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే, భారత్ వ్యాక్సిన్పై ఉన్న నమ్మకంతో బ్రెజిల్ కోవాగ్జిన్ ను కోనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. 20 కోట్ల…
కరోనా బాధితులను ఆదుకునేందుకు సాధన దీక్ష చేయడం ఒక చరిత్ర అని… సీఎం జగన్ బాధ్యతా రాహిత్యంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టీడీపీ చేపట్టిన సాధన దీక్ష ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు, ప్రజలు, పత్రికలు చెప్పినా పాటించడం ఆనవాయితీగా వస్తోందని… ఒకప్పుడు పేపర్లలో…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోగా… కొత్త వేరియంట్లు.. డెల్టా, డెల్టా ప్లస్ కలవర పెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో భారత్ నుంచి రాకపోకలపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది ఫీలిప్పైన్స్.. ఇప్పటికే చాలా దేశాలు భారత విమానాలపై బ్యాన్ విధించగా.. ఇప్పటికే భారత్ నుంచి రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జులై 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఫీలిప్పైన్స్.. ఇక, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, యూఏఈ దేశాలపై కూడా ఈ నిషేధ ఆంక్షలు…
తెలంగాణ మళ్లీ కరోనా కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,362 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,22,593కు చేరుకోగా.. రికవరీ కేసులు 6,05,455కు పెరిగాయి… ఇప్పటి వరకు కోవిడ్తో 3,651 మంది మృతిచెందారు.. కరోనా…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 91,231 సాంపిల్స్ పరీక్షించగా.. 3,620 మంది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 41 మంది కోవిడ్తో మృతిచెందారు.. చిత్తూరు జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలో ఐదుగురు చొప్పున, గూంటురు,…
కరోనాకు చెక్పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్లో వ్యాక్సినేషన్ను మరింత విస్తృతం చేసేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతులు ఇస్తూ వస్తోంది భారత్.. ఇప్పటికే స్వదేశంలో తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉండగా.. రష్యా తయారు చేసిన స్పూత్నిక్ వీకు కూడా గ్రీన్ సిగ్నల్ రాగా.. తాజాగా.. అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ దిగుమతితో పాటు అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.. మోడెర్నా వ్యాక్సిన్ను…
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంది. దేశంలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, డిమాండ్కు సరిపడినన్ని వ్యాక్సిన్లు లేకపోవడంతో అత్యవసర వినియోగం కింద మరో వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోవడానికి అనుమతులు లభించినట్టు సమాచారం. కరోనా మహమ్మారిపై సమర్ధవంతంగా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్ను ఇండియాలో దిగుమతి, అమ్మకాల కోసం ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా డీసీజీఐ కు ధరఖాస్తు చేసుకోగా, అనుమతులు మంజూరు చేసినట్లు…
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కారణంగా వేలాది మంది ఇప్పటికే మృతి చెందారు. లక్షలాది మంది కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాంట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ టీడీపీ సాధన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు సాధన దీక్షలు చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో నిరసన దీక్ష చేస్తున్నారు. ఉదయం 11 గంటల…