నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే సోదాలు మొదలైనట్లు అధికారులు తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో… ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కేసులో మంగళవారం నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది. హస్తినలోని కేంద్ర కార్యాలయంతో పాటు 12 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దాడులు పూర్తయిన తర్వాత… ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. గల నెలలో మూడు రోజులు పాటు ఈడీ… సోనియా గాంధీని 12 గంటల పాటు ప్రశ్నించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ… విచారణ పేరుతో ఈడీ కార్యాలయానికి రప్పించింది. అంతకు ముందు సోనియా…
congress hold key meeting with telangana leaders about komatireddy Rajgopal Reddy issue: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది.
రాజగోపాల్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యే.. ఆయన తో నేనని, అధిష్టానం మాట్లాడిందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు. సాధ్యమైనంత వరకు పార్టీలో ఉండేలా చూస్తున్నామని అన్నారు. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకోలేదు కదా..? అంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడొద్దని బుజ్జగిస్తూ ఉన్నామని భట్టి స్పష్టం చేసారు. రాజగోపాల్ రెడ్డితో అధిష్టానం, మాట్లాడుతుందని, మేము మాట్లాడుతూ ఉన్నామని తెలిపారు. పార్టీ లో మీకు ఉన్న ఇబ్బందులు ఏంటని రాజగోపాల్ ను అడుగుతున్నామని అన్నారు.…
కేసీఆర్ ఢిల్లీలో.. కేటీఆర్ ఇంట్లో..! అసలు పాలన ఉందా.. రాష్ట్రంలో..? అంటూ సీఎల్పీనేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎనిమిది యేండ్ల అధాయం, అప్పులు కాళేశ్వరంలో ధార పోశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. వరదకు మొత్తం మునిగిపోయిందని మండిపడ్డారు. కట్టిన వాల్స్ కూలి పోయాయని, ఎనిమిది యేండ్ల సంపదను అప్పులు, నిరుపయోగంగా మారిపోయిందని విమర్శించారు. అసలు ఏం జరుగుతుంది అనే పరిశీలనకు వెళ్తే కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. Kgf మైన్…