Rahul Gandhi: దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi criticizes BJP and RSS: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక బళ్లారిలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని అన్నారు. బీజేపీ దేశంలోని ప్రజలను విడదీస్తుందని చాలా మంది ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలోనే ఈ యాత్రకు ‘ భారత్ జోడో యాత్ర’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన యాత్ర 38వ రోజుకు చేరుకుంది. శనివారం నాటికి రాహుల్ గాంధీ పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
Read Also: Palle Ravikumar : కాంగ్రెస్కు షాక్.. టీఆర్ఎస్లోకి పల్లె రవి దంపతులు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
భారతదేశంలో గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతీ ఏడాది 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రధాని మోదీ చెప్పారని..అయితే ఆ ఉద్యోగాలన్నీ ఎక్కడి పోయాయని ప్రశ్నించారు. కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా మారారని అన్నారు. కర్ణాటకలో 2.5 లక్షల ప్రభుత్వ పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని అని ప్రశ్నించారు. పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ కావాలంటే రూ.80 లక్షలు చెల్లించి కావచ్చని.. డబ్బుంటే కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనుక్కొవచ్చని ఆరోపించారు. డబ్బు లేకుంటే మీరంతా జీవితాంతం నిరుద్యోగులుగా ఉండాల్సిందే అని గాంధీ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా కర్ణాటకకు చేరుకుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలో సాగుతోంది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ భారీ యాత్రకు రూపకల్పన చేసింది. 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఈ యాత్ర సాగనుంది. కర్ణాటక తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ఈ యాత్ర సాగనుంది. కన్యాకుమారిలో ప్రారంభం అయిన ఈ పాదయాత్ర కాశ్మీర్ లో ముగియనుంది.
Today India has the highest unemployment ever in 45 years. PM had said that he would provide employment to 2 crore youth every year. Where did those jobs go? Instead, crores of youth have become unemployed: Congress MP Rahul Gandhi in Ballari, Karnataka pic.twitter.com/YuRqKGO5d4
— ANI (@ANI) October 15, 2022
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!