Bharat Jodo Yatra: కీలక మైలురాయిని చేరుకోనున్న భారత్ జోడో యాత్ర.. నేటితో 1000 కిలోమీటర్లు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra To Complete 1000 Km Tomorrow: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కీలక మైలురాయిని చేరుకుంది. శనివారం జరిగే రాహుల్ గాంధీ 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకుంటుంది. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయింది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తై ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి చేరుకుంది. శనివారం కర్ణాటకలో బళ్లారి జిల్లాకు చేరుకోవడంతో పాదయాత్ర 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకుంటుంది. బళ్లారిలో లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ బహిరంగ సభ జరగనుంది.
భారత్ జోడో యాత్రలో భాగంగా తమిళనాడులో సుమారుగా లక్ష మంది పాదయాత్రలో పాల్గొనగా.. కేరళ చేరే సరికి ఆ సంఖ్య 1.25 లక్షలు, కర్ణాటకలో 1.5 లక్షల మంది చేరగా.. ఆంధ్రప్రదేశ్ లోకి చేరే సరికి సుమారుగా 2 లక్షల మంది యాత్రలో పాల్గొంటారని అంచానా వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్రలో అన్ని వర్గాలను కలుస్తున్నారు రాహుల్ గాంధీ.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న పాదయాత్ర త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించనుంది. బీజేపీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను కలిపే విధంగా భారత్ జోడో యాత్రను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగం, ద్రవ్యోల్బనం, పెరుగుతున్న ధరలపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. మొత్తం 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. కన్యాకుమారిలో ప్రారంభం అయిన పాదయాత్ర కాశ్మీర్ లో ముగియనుంది.
వరసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ 2024లో అధికారంలోకి రావాాలని ప్రయత్నిస్తోంది. బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు భారత్ జోడో యాత్ర సహాయపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ టార్గెట్ గా భారత్ జోడో యాత్రలో విమర్శలు గుప్పిస్తున్నారు రాహుల్ గాంధీ. గత వారం పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!