బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. టికెట్లు ఇచ్చిన పోటీ చేయమని వెనక్కి తగ్గుతున్నారని, మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నుండి 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, బాయిల్డ్ రైస్ కొనాలని మోడీని కోరితే ఓకే చెప్పారన్నారు కిషన్ రెడ్డి.…
నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అసలు స్వరూపం ప్రజలకు త్వరలో అర్థం అవుతుందన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టమంటారో చెప్పాలన్నారు ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను వీడుతున్న వాళ్ళంతా స్వార్థ…
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీప్ ఇచ్చింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం నాగు జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ భార్యలు పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు ద్వీపం అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. 1974లో ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారని కమలం పార్టీ ఆరోపించింది.
Katchatheevu Row: భారత్-శ్రీలంక మధ్య ఉన్న కచ్చతీవు ద్వీపం ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. లంక ఆధీనంలో ఉన్న ఈ చిన్న ద్వీపం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే. అన్నామలై ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం కాంగ్రెస్, డీఎంకే పార్టీలను ఇబ్బందుల్లో పడేసింది.
ప్రకృతి వైపరీత్యాలని, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలనీ ప్రయత్నించే నీచమైన ప్రవృత్తి గల ప్రతిపక్ష నాయకులారా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7, 2023. అంటే వర్షాకాలం అయిపోయిన తరువాత. అప్పటికే నాగార్జునసాగర్ లో నీళ్లు లేని కారణంగా మొదటిపంటకే నీళ్ళివనీ మీరు, రెండో పంటకి నీళ్ళివాలని హేతుబద్దత లేని డిమాండులు చేయడం మీ దుర్భుద్దికి…
విపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్కి పొలంబాట పట్టాలని అర్థమైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనం బాట మరిచిన కేసిఆర్ కు ప్రజల అజెండా ఏంటో తెలియడంలేదన్నారు. అధికారం కోల్పోయిన మూడు నెలలకే రాజకీయంగా పతనమైన తర్వాత కేసిఆర్ జనంలోకి రావాలనుకోవడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల తర్వాత కేసిఆర్ కు ప్రజలు గుర్తుకు వచ్చారని, అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులు పడ్డ సమయంలో పట్టించుకోని కేసిఆర్,…
మోడీ సర్కారు రాజ్యాంగ పునాదులు కూల్చేస్తుందlr, బీజేపీకి 2019 ఫలితాలు రావనే భయం పట్టుకుందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భయం లేకుంటే కేజ్రీవాల్.. సోరేన్ లను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు కకావికాలం చేసి.. బలహీన పరిచే ఎత్తుగడలో బీజేపీ ఉందని, బీజేపీ బలంగానే ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకులను చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారన్నారు. నీతికి నిర్వచనం మార్చేశారు మోడీ అని,…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఐ నివేదిక ద్వారా మన దేశానికి చెందిన ‘కచ్చతీవు’ ద్వీపాన్ని శ్రీలంకకు ఎలా అప్పగించిందనే వివరాలు వెల్లడైన తర్వాత, ప్రధాని నరేంద్రమోడీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.