Elections 2024: దేశవ్యాప్తంగా కేవలం 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ.. కారణం అదేనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని అత్యధిక కాలం పాలన చేసిన పార్టీగా కాంగ్రెస్ కు చరిత్ర ఉంది. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కేవలం దేశవ్యాప్తంగా 326 స్థానాలకె కాంగ్రెస్ పరిమితమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా వారిని ఇంకా హోల్డ్ లో పెట్టింది. అయితే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు చూస్తే..
Also Read: Bhadrachalam LIVE: భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ప్రత్యక్షప్రసారం
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
- IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
- ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
ప్రస్తుతం భారతదేశ ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏను ఎదుర్కోవడం ఒంటరిగా అసాధ్యమైన పని కావడంతో.. కాంగ్రెస్ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో లోకల్ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఇక తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గడ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలతో పాటు మరో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ పార్టీ పూర్తిస్థానాల్లో పోటీకి దిగనుంది. మిగతా రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో సీట్లను పంచుకోబోతోంది.
Also Read: Shreyas Iyer: ఈ ఓటమిని ఊహించలేదు.. చాలా బాధగా ఉంది: శ్రేయస్ అయ్యర్
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పట్టుకుదురుకొని బరిలోకి దిగనుంది. మరోవైపు కేరళ రాష్ట్రంలో లెఫ్ట్ కూటమితో హోరహోరిగా కాంగ్రెస్ తలపడనుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభావం కేవలం మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి పార్టీకి బలమైన పోటీ ఇచ్చే స్థాయిలో కనబడుతుంది. మిగతా రాష్ట్రాల్లో బిజెపికి కాంగ్రెస్ పోటీ ఇచ్చే ఎలాంటి సూచనలు కనపడట్లేదు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రస్తుతం బలంగా కనబడుతోంది. ఇక అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విషయానికొస్తే.. వైయస్ షర్మిల నేతృత్వంలో పెద్దగా ఉనికి కనబడట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈసారి 326 సీట్లలో పోటీ చేస్తున్నప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వారు పోటీ ఇవ్వనున్నట్లుగా అర్థమవుతోంది.
తాజావార్తలు
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
-
Tollywood : టాలీవుడ్కు ఒక గట్టి గుణపాఠం నేర్పిన మా ఇంటి బంగారం, లెనిన్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Prithviraj Sukumaran: ఇతర భాషల్లో క్రేజ్… మాలీవుడ్లో తగ్గుతున్న పృథ్వీరాజ్ జోరు?
-
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!