భారతదేశంలోని అత్యధిక కాలం పాలన చేసిన పార్టీగా కాంగ్రెస్ కు చరిత్ర ఉంది. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కేవలం దేశవ్యాప్తంగా 326 స్థానాలకె కాంగ్రెస్ పరిమితమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా వారిని ఇంకా హోల్డ్ లో పెట్టింది. అయితే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు చూస్తే..
Also Read: Bhadrachalam LIVE: భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ప్రత్యక్షప్రసారం
ప్రస్తుతం భారతదేశ ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏను ఎదుర్కోవడం ఒంటరిగా అసాధ్యమైన పని కావడంతో.. కాంగ్రెస్ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో లోకల్ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఇక తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గడ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలతో పాటు మరో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ పార్టీ పూర్తిస్థానాల్లో పోటీకి దిగనుంది. మిగతా రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో సీట్లను పంచుకోబోతోంది.
Also Read: Shreyas Iyer: ఈ ఓటమిని ఊహించలేదు.. చాలా బాధగా ఉంది: శ్రేయస్ అయ్యర్
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పట్టుకుదురుకొని బరిలోకి దిగనుంది. మరోవైపు కేరళ రాష్ట్రంలో లెఫ్ట్ కూటమితో హోరహోరిగా కాంగ్రెస్ తలపడనుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభావం కేవలం మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి పార్టీకి బలమైన పోటీ ఇచ్చే స్థాయిలో కనబడుతుంది. మిగతా రాష్ట్రాల్లో బిజెపికి కాంగ్రెస్ పోటీ ఇచ్చే ఎలాంటి సూచనలు కనపడట్లేదు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రస్తుతం బలంగా కనబడుతోంది. ఇక అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విషయానికొస్తే.. వైయస్ షర్మిల నేతృత్వంలో పెద్దగా ఉనికి కనబడట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈసారి 326 సీట్లలో పోటీ చేస్తున్నప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వారు పోటీ ఇవ్వనున్నట్లుగా అర్థమవుతోంది.