సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషమని.. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కరని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్ షా విధానమని ఆయన విమర్శించారు.
ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్లోని వారి నివాసంలో కలిశారు.
దేశంలో మొదటి, రెండో దశ సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే దేశంలోని రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ల అభ్యర్థిత్వంపై కొన్ని ముఖ్యమైన స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ఇప్పటి వరకు 418 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 92 మంది సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లను పార్టీ రద్దు చేసింది.
నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ హామీ.. కొత్త చట్టం తీసుకొస్తాం..! ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళల ఖాతాల్లోకి ఏటా లక్ష రూపాయలను జమ చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఇదిలా…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళల ఖాతాల్లోకి ఏటా లక్ష రూపాయలను జమ చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు.
తుక్కుగుడా వేదికగా రాహుల్ గాంధీ పంచ్ న్యాయ గ్యారెంటీలు ప్రకటించాడని, సోనియా గాంధీ కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు అదే తుక్కుగుడా లో ఆరు గ్యారెంటీ లు ప్రకటించిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్.. హామీల అమలు విఫలం అయ్యిందన్నారు. సోనియా గాంధీ కి తెలంగాణ ప్రజలకు మొహం చూపించలేకే రాహుల్ గాంధీ వచ్చాడన్నారు. రాష్ట్ర మహిళలకు ప్రకటించిన 2500 రూపాయలే ఇవ్వలేక…
సెంటి మెంట్ తో బీఆర్ఎస్ ,బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తుంది కాబట్టి కొంతమంది వ్యూహరక్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. ప్రశాంత్ కిశోర్ ముందునుంచి మాకు వ్యతిరేఖంగానే ఉన్నారని, రాహుల్ గాంధీ వద్దకు వస్తే ఆయన్ను పక్కన పెట్టారన్నారు. పీకే గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేశారని, ఆయన చెప్పింది ఏం కాలేదు..అంతకంటే గొప్పవాళ్లు మాకున్నారన్నారు. బీజేపీ గుడుల గురించి తప్పా బడులగురించి మాట్లాడడం లేదని ఆమె…