Raghunandan Rao: సిద్దిపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబం దోచుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ఫైర్ అయ్యారు. సిద్దపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబాన్ని దోచుకుంటుందని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు ఆ కుటుంబాన్ని వద్దనుకొని బీజేపీని కోరుకుంటున్నారని అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ ముందు “నయవంచన” అని రాసిన బోర్డు పెట్టుని ధర్నా చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తున్నారన్నారు. దేశంలో నయవంచన అనే పదానికి పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ అని రఘునందన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో మెజార్టీ ప్రజలను వంచించిందని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చా.. దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలను తెచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలైనా.. ఇంత వరకు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని అడిగారు.
READ MORE: World Record: వామ్మో.. ఒక్కపరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు పడగొట్టిన బౌలర్..
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు మర్చలేదని అసెంబ్లీలో కొట్లాడానని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. వెంట్రామిరెడ్డి పేద ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు. బీజేపీ పార్టీకి కార్యకర్తలే బలం.. వాళ్లే శ్వాస, ధ్యాస.. అన్నారు. ఇంత ఎండలో వేరే పార్టీ నాయకులు మీడింగ్ పెడితే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తాయన్నారు. నాటి నరేంద్రుడి కలను ప్రధాని మోదీ నెరవేరని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన మన దేశం గురించి గొప్పగా చెప్పుకునే విధంగా మోదీ చేశారన్నారు. ఇదే నియోజకవర్గంలో 1995లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 19 వేల ఓట్లు సాధించిందని చెప్పారు. నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ.. కాషాయ జెండాను విడిచి పెట్టమని లేదంటే చంపేస్తామని బెదిరించినప్పటికీ వదలలేదని గుర్తుచేశారు. సిద్దిపేట గడ్డ కాషాయానికి అడ్డ అన్నారు. దేశంలో మోదీని మరోసారి గెలిపిస్తే దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!