భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, వేలాదిమంది కార్యకర్తల శ్రమ, వందల మంది నాయకుల కష్టంతో కేసీఆర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తెల్లం వెంకటరావు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఏకైక స్థానాన్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని.. స్థానికుడు చదువుకున్న వ్యక్తి అని ఓటు వేసి…
Congress: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘‘ముస్లిం లీగ్’’ భావజాలం ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన తరుణంలో ఆయన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. తన కుర్చీని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
Prashant Kishor: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు రాకుంటే రాహుల్ గాంధీ తప్పుకోవడం మంచిదని అన్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.
మంచిర్యాల జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభ్యర్థులను చూసి ఓటు వేయండని.. పెద్దపల్లిలో యువకుడి వంశీని ముందుంచామన్నారు. ఈ సందర్భంగా.. నేతకాని సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. తాము ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పనులకు కోడ్ వల్ల ఆటంకం కలిగింది.. 2018 ఎన్నికలు జరిగిన తరువాత రెండు నెలల తరువాత పాలన మొదలు…
కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో దిక్కుమాలిన మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు.. ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను బొంద పెట్టారని రాణి రుద్రమ మండిపడ్డారు. దేశ ప్రజలు మోడీకి ఓటు వేయాలని చూస్తున్నారు.. రాహుల్ గాంధీని ఆదర్శంగా…
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో అధికార కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో…
Jagadish Reddy: కేసీఆర్ రాకతో లాగులు తడిసి బాహుబలి మోటర్లు అన్ చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి అన్నారు. తుక్కుగుడా సభ పెట్టి మరొక సారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు.
ప్రకాశంలో ట్రాఫిక్ మళ్లింపు.. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ సందర్భంగా ఆ రహదారిలో వాహనాల దారి మళ్లింపు చేశారు పోలీసులు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు నాగిరెడ్డిపల్లి దగ్గర నుంచి వెలిగొండ స్వామి గుడి మీదుగా చినమనగుండం వద్ద నంద్యాల నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో వెళ్లాలి. ఒంగోలు నుంచి మార్కాపురం వైపు వెళ్లే వాహనాలు పొదిలి, చిన్నారికట్ల జంక్షన్ దాటిన తర్వాత పాతపాడు…
ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి మణిపుర్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి.