Priyanka Gandhi: ప్రధాని మోడీ, బీజేపీ నేతల వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన ప్రియాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ, బీజేపీ నేతలపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే నిరాశానిస్పృహలు బీజేపీలో కనిపిస్తుందన్నారు. ఆ కారణంగానే ప్రజా సంక్షేమంతో ఏ మాత్రం సంబంధంలేని రోజుకో అంశాన్ని ఆ పార్టీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక దుయ్యబట్టింది. ప్రజలకు అబద్ధాలు చెప్పడం, తప్పుదారిపట్టించడం, వారిని భయపెట్టడం వంటి స్థాయికి బీజేపీ నేతలు దిగజారిందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విమర్శించారు.
ఇది కూడా చదవండి: Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ పోటీ చేసే లోక్సభ స్థానం ఇదే!
Also Read
- Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు'.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
- Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడం, విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పిండం వంటి అంశాలపై దృష్టి సారించి ఉంటే ఈరోజు వేదకలపై ఇతర అంశాలు ప్రస్తావించాల్సిన అవసరమే వచ్చేది కాదని ప్రియాంక అన్నారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికలు తమకు అనుకూలం లేవని బీజేపీ నేతలు గ్రహించినందునే కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం, దాడులు సాగిస్తున్నారని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Veera Shiva Reddy: కడప జిల్లాలో టీడీపీకి షాక్.. రేపే వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే
ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతల ప్రవర్తన చూసినప్పుడు ఎన్నికలు తమకు అనుకూలంగా లేవని వారు గ్రహించినట్టు కనిపిస్తోందన్నారు. వారంతో నిరాశానిస్పృహలతో కనిపిస్తున్నారని తెలిపారు. అందుకే అసంబద్ధమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. 10 ఏళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ఉంటే ఈరోజు వేదికలపై అసంబద్ధమైన ప్రస్తావనలు వచ్చేవి కావని తెలిపారు. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారన్నారు. అవేవీ ప్రజలకు ఉపయోగపడేవి కావని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ పోటీ చేస్తు్న్న వయనాడ్లో బుధవారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చేశారు. బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఏప్రిల్ 26న కేరళలోని 20 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందని ఎన్నికల ర్యాలీలో ప్రియాంక అన్నారు. కుటుంబపాలన అంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ఈ దేశం కోసం తన తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేసిందని గుర్తుచేశారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు సిగ్గులేని వ్యా్ఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?